బ్యాంకుల నుంచి తీసుకున్న వేలాది కోట్ల రూపాయల రుణాన్ని ఎగవేసి విదేశాలకు పారిపోయిన భారత ఆర్థిక ఉగ్రవాది గీతాంజలి జెమ్స్ యజమాని మెహుల్ చోక్సీపై కేంద్ర దర్యాప్తు సంస్థ మరో కేసు నమోదు చేసింది. రుణాలు పోందడమే కాదు.. డబ్బు కోసం బ్యాంకులను వేల కోసం మేర మోసం చేసినట్టు కూడా తాజాగా వెల్లడైంది. ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్సీఐ)ని ఆయన కోట్ల రూపాయల మేర మోసగించినట్టుగా సీబీఐ అధికారులు తాజాగా మరో కేసును నమోదు చేశారు. చోక్సీతో పాటు ఆయన కంపెనీ గీతాంజలి జెమ్స్పైనా కేసు నమోదు చేశారు.
వజ్రాలు, ఆభరణాలను తాకట్టు పెట్టి మెహుల్ చోక్సీ ఐఎఫ్సీఐ నుంచి రూ.25కోట్ల రుణం తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ కేసులో మెహుల్ చోక్సీ, ఆయనకు చెందిన గీతాంజలి జెమ్స్, సూరజ్మల్ లల్లూభాయ్ అండ్ కో, నవేంద్ర జవేరి, ప్రదీప్ సి షా, శ్రేక్ షాలపై సీబీఐ కేసు నమోదు చేసింది. నలుగురు వేర్వేరు అప్రైజర్లు ఆభరణాల విలువ రూ.34-45 కోట్లుగా ఇవ్వగా.. దీంతో ఐఎఫ్సీఐ చోక్సీకి రుణం ఇచ్చింది. కంపెనీ రుణాన్ని తిరిగి చెల్లించకపోవడంతో తనఖా పెట్టిన షేర్లు, ఆభరణాలను విక్రయించి రికవరీ చేసుకున్నందుకు చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలో తాకట్టుపెట్టిన 20,60,054 షేర్లలో 6,48,822 షేర్లను ఐఎఫ్సీఐ రూ.4.07కోట్లు రివకరీ చేసుకున్నది.
చోక్సీ తనఖా పెట్టిన బంగారం, వజ్రాలు, ఇతర ఆభరణాల విలువ వాల్యుయేషన్ కంటే దాదాపు 98శాతం తక్కువగా కేవలం రూ.70లక్షల నుంచి 2 కోట్ల వరకు మాత్రమే ఉన్నట్లు తేలింది. వజ్రాలు నాసిరకంగా ఉన్నాయని, ల్యాబ్లో తయారు చేసినట్లు గుర్తించగా, రత్నాలు సైతం అసలైనవి కావని తేలింది. ఈ కేసుపై చోక్సీ తరఫు న్యాయవాది విజయ్ అగర్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చోక్సీపై సీబీఐ నమోదు చేసిన కొత్త కేసు ఊసుపోని కబుర్లు చెప్పుకునేందుకు మాత్రమే పనికొస్తుందని, కోర్టులో మాత్రం నిలవదని ఆయన అన్నారు. తన క్లయింట్ను కిడ్నాప్ చేసేందుకు అంటిగ్వాకు కూడా వెళ్లేందుకు యత్నించిన సీబీఐ... ముందుగా తమలోని లోపాలపై దృష్టి పెట్టాలని సూచించారు.
(And get your daily news straight to your inbox)
Aug 12 | అంతర్జాతీయంగా మోస్ట్ పాపులర్ బేబీ పౌడర్ జాన్సన్ & జాన్సన్ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ కంపెనీకి చెందిన ప్రకటనలు పెద్దలను మరీ ముఖ్యంగా అమ్మలను చాలా ఆకర్షిస్తాయనడంలో సందేహమే లేదు. అంతేకాదు... Read more
Aug 12 | భారతదేశ 75 ఏళ్ల వజ్రోత్సవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సన్నాహాలు చేస్తున్న క్రమంలో కేంద్రప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. 75 ఏళ్ల స్వతంత్ర్య దినోత్సవ వేడుకలలో భాగంగా... Read more
Aug 12 | ప్రభుత్వ పెద్దలు ప్రచారాల కోసం చెప్పేది ఒకటి.. కానీ వాస్తవిక పరిస్థితుల్లో క్షేత్రస్థాయిలో ఎదుర్కోనేది మరోకటి అంటూ ఇన్నాళ్లు దేశంలోని పేదలు చెబుతున్నా ఎవరూ పట్టించుకున్న దాఖలాలే లేవు. ప్రభుత్వ పెద్దలు ప్రకటనలకు.. ఆచరణలో... Read more
Aug 12 | నడిరోడ్డుపై మహిళతో అసభ్యకరంగా వ్యవహరిస్తున్నా అక్కడి జనం చోద్యం చూశారు. నలుగురైదుగురు వ్యక్తులను నిలువరించే ప్రయత్నం అక్కడ వేడుక చూస్తున్న మనుషులకు లేకుండా పోయింది. ఆకాశంలో సగం అంటూ మహిళల హక్కుల కోసం నినదిస్తున్న... Read more
Aug 11 | ఉచిత పధకాలను వ్యతిరేకిస్తున్న కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ తీరును దుయ్యబడుతూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. దేశంలోని ప్రజల సంక్షేమాన్ని కాంక్షించే ప్రభుత్వాలుగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఉండాలని రాజ్యంగంలోనే ఉందని..... Read more