ఆటో డ్రైవర్ గా వున్న వ్యక్తిని హీరోగా చేసిన కన్నడ రాష్ట్రం.. అదే హీరోను పాన్ ఇండియా హీరోగా నిలబెడుతోంది. కానీ ఆంగ్లంలో నిష్ణాతుడైన ఓ పండితుడికి మాత్రం ఉపాధిని కల్పించలేకపోయింది. దీంతో ఆయన ఆంగ్లాన్ని నమ్ముకోవడం కన్నా ఆటోను తోలుకోవడం సులభమని తన బతుకుబండిని నడుపుతున్నారు. ఔనా.. ఇది నిజమేనా.? అంటే ముమ్మాటికీ నిజం. అయితే అందుకు ఓ కారణం వుంది. అదేంటో తెలియాలంటే ఆయన కథలోకి వెళ్లాలి. అయితే ఆయన ఆటోలో ప్రయాణించి.. ఆయనతో దాదాపుగా 45 నిమిషాల పాటు మాట్లాడిన నిఖిత అయ్యార్ అనే ప్యాసెంజర్ తన ఇస్టాలో పోస్టు చేసిన కథలో ఆయన వివరాలు ఉన్నాయి.
కర్ణాటక రాజధాని బెంగళూరులో ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్న ఆయన ఆంగ్ల పండితుడి పేరు పట్టాభి రామన్. ఆయన వయస్సు ఏకంగా 74 ఏళ్లు, అనర్గళంగా ఆయన ఆంగ్లం మాట్లడగలదు. బెంగుళూరులోని మరోవైపున ఉన్న తన కార్యాలయానికి అమె వెళ్లాలి. అయితే అమెకు కాస్తా ఆలస్యమైందని కంగారుపడుతోంది. దీంతో అప్పుడే వెనుకగా వచ్చిన ఓ ఆటో.. నా ఆటోలో రండీ మేడం.. మీకు తోచ్చింది ఇవచ్చు కానీ.. అంటూ ఆంగ్లంలో చెప్పారు. అందుకు అమెసమ్మతించి అటో ఎక్కడంతో పాటు మీరు ఇంత ఫ్లూయంట్ ఇంగ్లాషు మాట్లాడుతున్నారు. అంటూ మాటలు కలిపింది ప్యాసెంజర్ నిఖిత అయ్యార్.
పట్టాబిరామన్ తో మాట్లాడిన తరువాత ఆయన గురించి తన సోషల్ మీడియా అకౌంట్ లో ఓ స్టోరిని రాసింది నిఖితా అయ్యార్. పట్టాభిరామన్ మాట తీరు చూసిన నిఖిత అయ్యర్ అనే మహిళా ఉద్యోగి ఆ వివరాలను లింక్డ్ ఇన్ లో పోస్ట్ చేశారు. ఆసక్తికరమైన ఆయన జీవిత విశేషాలను పంచుకున్నారు. రిటైర్ అయ్యాక ఏ జాబ్ దొరకలేదని, దీంతో 14 ఏళ్లుగా ఆటో నడుపుకుంటూ జీవిస్తున్నానని పట్టాభి రామన్ చెప్పారు. కర్ణాటకలో ఉద్యోగ అవకాశాల్లేక ముంబైకి వెళ్లి పోవాయిలోని ఓ ప్రముఖ కాలేజీలో ఇంగ్లిష్ లెక్చరర్ గా చేరానన్నారు. ఎంఏ ఎంఈడీ చేసిన తాను అప్పట్లో బెంగళూరులో ఎక్కడ ఇంటర్వ్యూకు వెళ్లినా ‘నీ కులం ఏంటి?’ అన్న ప్రశ్నే ఎదురైందని, తన పూర్తి పేరు చెప్పగానే అర్థమై ‘తర్వాత చెప్తాం’ అని చెప్పి పంపించేవారని ఆయన గుర్తు చేసుకున్నారు.
దీంతో ముంబైకి వెళ్లి 20 ఏళ్ల పాటు ఇంగ్లిష్ లెక్చరర్ గా పనిచేశానని పేర్కొన్నారు. రిటైర్ అయ్యాక బెంగళూరు వచ్చేశానని తెలిపారు. టీచింగ్ చేసేటప్పుడు నెలకు రూ.15 వేలు మాత్రమే ఇచ్చేవారని, కానీ, ఇప్పుడు ఆటో నడుపుతూ రోజుకు రూ.700 నుంచి రూ.1,500 సంపాదిస్తున్నానని పెద్దాయన చెప్పారు. తన భార్యే తనకు గర్ల్ ఫ్రెండ్ అని, భార్యలనూ సమానంగా చూడాల్సిన అవసరం ఉందని చెప్పారు. భర్తకన్నా భార్య ఎప్పుడూ తక్కువ కాదని అన్నారు. కొన్ని కొన్ని సార్లు తనకన్నా తన భార్యే ఎక్కువని అన్నారు. తమకు పిల్లలున్నా వారికి భారం కారాదన్న ఉద్దేశంతోనే తాను ఆటో నడుపుతున్నానని పట్టాభిరామన్ తెలిపారు. ఎవరి జీవితం వాళ్లం గడుపుతున్నామని చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more