బంగాళాఖాతంలో గురువారం ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి వాయుగుండంగా మారింది. ఇది కూడా క్రమేపి రానున్న 24 గంటల వ్యవధిలో బలపడి తీవ్ర వాయుగుండగా మారనుందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, పుద్దుచ్చేరి సహా పలు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తమిళనాడులోని నాగపట్నం నుంచి 320 కి.మీ దూరంలో కేంద్రీకృతం కావడంతో 13 కి.మీల వేగంతో ఉత్తర దిశగా వాయుగుడం కదులుతోంది.
ఇది సాయంత్రం వరకు తమిళనాడు తీరానికి మరింత దగ్గరగా వచ్చే అవకాశం ఉంది. దీని కారణంగా తమిళనాడు, కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీసే అవకాశాలు వున్నాయని తెలిపింది. ముఖ్యంగా కోస్తాంధ్ర సహా రాయలసీమ ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశాలు వున్నాయిని తెలిపింది. రాయలసీమలోని నిర్ఝన ప్రదేశాల్లో పిడుగులు కూడా పడే అవకాశాలు వున్నాయిన వాతావరణ శాఖ ప్రజలకు హెచ్చిరకలు జారీ చేసింది.
దీంతో తమిళానాడులో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందిని వాతావరణ శాఖ తెలిపింది. అంతే కాకుండా వాయుగుడం ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమాలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో ఏపీలో మత్య్సకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లకూడదని వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more