పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో టీడీపీ చేపట్టిన సైకిల్ యాత్రలో అపశృతి దొర్లింది. ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ప్రమాదవశాత్తు సైకిల్ పైనుంచి జారి కిందపడ్డారు. వెంటనే అప్రమత్తమైన కార్యకర్తలు ఆయనను పైకి లేపారు. కాస్పేపు విరామం తీసుకున్న తర్వాత తిరిగి యాత్రను కొనసాగించారు. ఈ ఘటన దెందులూరు మండలం శింగవరం దగ్గర జరిగింది. పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఉచితంగా అందజేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సైకిల్ యాత్ర చేపట్టారు.
పాలకొల్లులోని టిడ్కో ఇళ్ల నుంచి రాష్ట్ర అసెంబ్లీ వరకు సైకిల్ యాత్రకు శ్రీకారం చుట్టారు. లబ్ధిదారుల ఆవేదనను తెలియజేసేందుకు, ఈ సమస్యను అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రస్తావించేందుకు ఎమ్మెల్య ఈ సైకిల్ యాత్ర చేపట్టారు. కాగా, శింగవరం వద్దకు చేరగానే ఏలూరు నియోజకవర్గం టీడీపీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు సైకిల్ తాకి ఎమ్మెల్యే నిమ్మల కిందపడిపోయారు. అయితే, ఎమ్మెల్యేకు గాయాలేవీ కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కొంతసేపు విశ్రాంతి తీసుకుని తిరిగి సైకిల్ యాత్రను చేపట్టారు.
అలాగే, పాలకొల్లులోని టిడ్కో ఇళ్లను లబ్దిదారులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ ఆఫీస్ దగ్గర 36 గంటల ఇంటి దీక్ష చేపట్టారు. తమ ప్రభుత్వంలో 90 శాతం ఇళ్ల నిర్మాణం పూర్తి చేసినప్పటికీ.. మిగిలిన 10 శాతం పనులను ఈ ప్రభుత్వం చేయలేకపోతోందని ఎమ్మెల్యే నిమ్మల విమర్శించారు. టిడ్కో ఇళ్ళు ఉచితంగా ఇస్తామని ఆనాడు పాదయాత్రలో చెప్పిన జగన్.. ఇవాళ బ్యాంకు ఋణాల పేరు చెప్పి అమ్ముకొంటున్నారని ఎమ్మెల్యే నిమ్మల ఆరోపించారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ సచివాలయాలకు, ఇళ్లకు రంగులు వేయడంపై ఉన్న ప్రేమ, పేదల ఇళ్ళు పూర్తి చేయడంపై సీఎం జగన్కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్కు రంగుల పిచ్చి ఉంటే.. తాడేపల్లి రాజప్రాసాదానికి, ఇడుపులపాయ ఎస్టేట్కు, లోటస్ పాండ్కు, బెంగుళూరు ప్యాలెస్కు రంగులు వేసుకోవాలని వ్యాఖ్యానించారు. గత మూడేళ్ల పాలనలో రాష్ట్రంలో జరిగిన అభివృద్దిపై చెప్పుకునేందుకు ఏమీ లేదని.. ఒక్క ఇటుక కూడా పెట్టని జగన్కు చంద్రబాబు కట్టిన ఇళ్లకు రంగులు వేయడం మాత్రం కావాలా? అంటూ ప్రశ్నించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more