తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కు కేంద్రప్రభుత్వం షాకిచ్చింది. తిరుమల శ్రీవారిపై అమితమైన భక్తితో విదేశాల నుంచి శ్రీవారి భక్తులు అందించే విరాళాలను స్వీకరించేందుకు కేంద్రం మెకాలడ్డింది. దేశవిదేశాలకు చెందిన భక్తులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలలో స్థిరపడిన భారతీయులు శ్రీవారి దర్శనం చేసుకోకపోయినా.. కనీసం శ్రీవారికి తమ వంతుగా విరాళాలను అందిస్తూనే ఉంటారు. అయితే ఇలా అందించే విదేశీ విరాళాలను స్వీకరించేందుకు టీటీడీకి ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (ఎఫ్సీఆర్ఏ) లైసెన్స్ ఉండాలి. అయితే ఈ లైసెన్సుతోనే ఇన్నాల్లు విరాళాలను అందుకున్న టీటీడీ.. తాజాగా రెన్యువల్ ను మాత్రం చేసుకోలేదు.
అందుకు ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యూలేషన్ యాక్ట్ సవరణలే పెద్ద కారణం. తాజాగా ఈ యాక్టులో సవరణలు చేసిన కేంద్రం.. సవరణల మేరకు లైసెన్సు చేసుకోవాలని తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎన్జీవోలు, ట్రస్టులతో పాటు టీటీడీ దేవాలయాన్ని కూడా అదేశించింది. అయితే తాజా సవరణల మేరకు టీటీడీ అధికారులు ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యూలేషన్ యాక్టు లైసెన్సును పునరుద్దరణ చేసుకోవడంలో సఫలం కాలేదు. దీంతో టీటీడీకి విదేశీ విరాళాల సేకరణకు బ్రేక్ పడింది. దాంతో విదేశీ భక్తుల నుంచి వచ్చే విరాళాలు నిలిచిపోయాయి. స్వచ్ఛంద, మతపరమైన సంస్థలకు విదేశీ విరాళాల వసూళ్లకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ జారీచేసే ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ లైసెన్స్ తప్పనసరి.
ఒక్కసారి ధరఖాస్తు చేసుకుంటే లైసెన్స్ ఐదేండ్ల పాటు కొనసాగనున్నది. టీటీడీ లైసెన్స్ గడువు 2020 డిసెంబర్తో ముగిసింది. లైసెన్స్ రెన్యువల్ కోసం ఏడాదిగా టీటీడీ అనేక ప్రయత్నాలు చేసింది. అయితే సవరించిన నిబంధనలకు అనుగుణంగా టీటీడీ రెన్యువల్ దరఖాస్తు చేసుకోలేకపోయింది. దేశవ్యాప్తంగా డిసెంబర్ 31 నాటికి 18,778 సంస్థలకు లైసెన్స్ గడువు ముగిసింది. 12,989 సంస్థలు రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకోగా.. 5,789 సంస్థలు దరఖాస్తు చేయలేదని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. 2020-21 ఏడాదిలో టీటీడీకి విదేశీ విరాళాలు ఒక్క రూపాయి కూడా అందలేదు. గతంలో టీటీడీకి పెద్ద సంఖ్యలో విదేశీ భక్తుల నుంచి విరాళాలు వచ్చేవి. లైసెన్స్ రెన్యువల్ కాకపోవడంతో ప్రస్తుతం టీటీడీకి విదేశీ విరాళాలు నిలిచిపోయాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more