దేశ సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఇవాళ సొంత గ్రామం కృష్ణా జిల్లా వీరులపాడు మండలం పొన్నవరం గ్రామంలో పర్యటించారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా గ్రామానికి కుటుంబ సమేతంగా వచ్చిన ఆయనకు గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు. గ్రామశివార్ల వరకు కాన్వాయ్ మధ్య వచ్చిన ఆయనను.. సంప్రదాయబద్ద రైతుబిడ్డగా మార్చి.. చిరకాలం గుర్తుండిపోయేలా ఎండ్ల బండిపై ఊరేగింపుగా తీసుకెళ్లారు. దారిపొడవునా గ్రామస్థులు జస్టిస్ ఎన్వీరమణకు పూల వర్షంతో అపూర్వ స్వాగతం పలికారు.
సీజేఐ కోసం గ్రామంలో పచ్చని తోరణాలు, ఫ్లెక్సీలతో ముస్తాబుచేశారు. పొన్నవరంలో ఆయన కుటుంబానికి పొలాలు ఉన్నాయి. ఆయన పెదనాన్న కుమారుడు నూతలపాటి వీరనారాయణ కుటుంబం ఇక్కడే నివాసం ఉంటోంది. సోదరుడి నివాసంలోనే భోజనం చేశారు. గ్రామంలో దాదాపు నాలుగు గంటల సమయం ఆయన గడిపారు. అక్కడి గ్రామస్థులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సభలోనూ ఆయన ప్రసంగించారు. తెలుగుజాతి ఔనత్యాన్ని పెంపొందించడానికి శాయశక్తులా కృషి చేస్తానని, తెలుగువారి గౌరవానికి భంగం వాటిల్ల కుండా పనిచేస్తానని భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ పేర్కొన్నారు. గ్రామస్థులంతా ఐక్యతగా ఉండడం గర్వంగా ఉందని, ఇదే వాతావరణం కొనసాగించాలని, అన్ని కులాలు, మతాలు కలిసి ఉమ్మడి కుటుంబంలా ఉండాలని కోరుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.
జస్టిస్ ఎన్వీ రమణ తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. చిన్ననాటి బాల్య మిత్రుడు శివలింగ ప్రసాద్తో కలిసి గ్రామంలో రోడ్లు, చెరువు కట్టలు, పంట పొలాల్లో సంతోషంగా గడిపేవారమని గుర్తుచేశారు. తమ ప్రాంతం చైతన్యం గల ప్రాంతమని అన్నారు. దేశమంతా అభివృద్ధి చెందినప్పటికీ కూడా తమ ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందలేదని ఆవేదన తనలో ఉందని అన్నారు. ప్రజలంతా ఐక్యంగా ఉండి సమస్యలను పరిష్కారం అయ్యేదాకా పట్టుదలతో ఉండాలని సూచించారు. తాను ఎక్కడికీ వెళ్లినా తెలుగు వారి గొప్పదనాన్ని అందరూ ప్రశంసిస్తుండడం గర్వంగా ఉందని అన్నారు. అప్ఘానిస్తాన్లో పార్లమెంట్ భవనాన్ని కూడా తెలుగు వారే నిర్మించారు.
కరోనా కష్టకాలంలో కరోనా మందును కనుగొన్న తెలుగువారు భారత్ బయోటెక్ ఎల్లాకృష్ణా, సుచిత్ర దంపతులు కావడం మనందరం గర్వపడాలని అన్నారు. తెలుగు జాతికి సరైనా గుర్తింపులేదని ఆవేదన తనలో ఉందని , అయితే తెలుగు భాషను, సంస్కృతిని, సంప్రదాయాలను , తెలుగు చైతన్యా న్నిపటిష్ట పరుచుకోవాలని సూచించారు. రైతులందరూ కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నారని, గిట్టుబాటు ధరలు లేకపోవడం, భూ సమస్య వివాదాలు అధిగమించాలంటే ఐక్యంగా ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు , మంత్రులు పెద్దిరెడ్డి, పేర్ని నాని తదితరులు పాల్గొన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more