రాజస్థాన్లో అమానవీయ ఘటన జరిగింది. అక్రమార్జనకు అలవాటు పడిన మద్యం మాఫియా.. తమపై ఫిర్యాదు చేసిన ఆర్టీఐ కార్యకర్తను దారుణంగా హింసించారు. అతడు మరణించాడని రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయారు. తమ అక్రమాలకు అడ్డువస్తున్నాడని భావించిన మద్యం మాఫియా ముఠా సభ్యులు.. తమ అనుచరులచేత వారిపై పిర్యాదు చేసిన అర్టిఐ కార్యకర్తను అపహరింపజేసి.. దారుణంగా హించించారు. కాళ్లు చేతులు మెలియ తప్పి విరగోట్టారు. కాళ్లలో మేకులు కొట్టారు. తమ అక్రమాలను వెలుగులోకి తీసుకురావడమే కాకుండా.. వాటిపై అటు పోలీసులకు, ఇటు అధికారులకు పిర్యాదు చేస్తున్నందున ఈ దారుణానికి ఒడిగట్టారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసు రాజస్థాన్ లో జరిగింది. మద్యం మాఫియా ఇంతలా వేళ్లూనుకుందంటే.. అక్కడి ప్రభుత్వ అధికారులతో పాటు పలువురు పెద్దల అండదండలు కూడా మెండుగా వుంటాయన్న అరోపణలు వినబడుతున్నాయి. ఈ కేసుకు సంబంధించిన పూర్వాపరాల్లోకి వెళ్తే... బార్మర్ జిల్లాకు చెందిన 30 ఏళ్ల అమ్రారామ్ గోద్రా ఆర్టీఐ కార్యకర్త. గ్రామ పంచాయతీ పరిధిలో అవినీతి, మద్యం అక్రమ అమ్మకాలపై ఫిర్యాదు చేశారు. విషయం తెలిసిన మద్యం మాఫియా ఈ నెల 21న ఆయనను అపహరించింది. ఆపై ఇనుపరాడ్లతో ఆయనపై దాడిచేశారు. కాళ్లు, చేతులు విరగ్గొట్టారు. అనంతరం రెండు కాళ్లలో మేకులు దిగ్గొట్టారు. ప్రస్తుతం జోధ్పూర్ ఆసుపత్రిలో ఉన్న గోద్రా ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
ఆర్టీఐ ద్వారా గోద్రా పోలీసులు, ఇతరులకు సమాచారం అందించినట్టు బార్మర్ ఎస్పీ దీపక్ భార్గవ తెలిపారు. ఆసుపత్రికి వెళ్లిన ఏఎస్పీ.. గోద్రాను పరామర్శించినట్టు చెప్పారు. ఈ ఘటనపై అత్యంత కఠినమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. నిందితుల కోసం నాలుగు బృందాలు ఏర్పాటు చేశామని, వీలైనంత త్వరగా వారిని పట్టుకుని శిక్షిస్తామని ఎస్పీ తెలిపారు. కారులో వచ్చిన 8 మంది దుండగులు గోద్రాను అపహరించి గంటల తరబడి హింసించారు. కాళ్లు, చేతులు విరగ్గొట్టారు. కాళ్లలో మేకులు దించారు. దీంతో అతడు చనిపోయాడని భావించి రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయారు.
కాగా ఈ కేసు విషయాన్ని సమీపంలోని మరో ఆర్టీఐ కార్యకర్త రాష్ట్ర మానవ హక్కుల కమీషన్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో హెచ్చ్ఆర్సీ ఈ విషయమై రాష్ట్ర డీజీపీని వివరాలు కోరింది. ఈ కేసులో దుండగులను విషయమై కూడా ప్రశ్నించింది. దీంతో ఘటన జరిగిన మరుసటి రోజు బార్మర్ జిల్లాలోని పరేయు గ్రామానికి వచ్చిన జిల్లా ఎస్పీ.. పరిశీలించారు. మద్యం మాఫియా పెద్దల అండదండతోనే ఆర్టీఐ కార్యకర్తపై హత్యాయత్నం జరిగిందని అన్నారు. కాగా పోలీసులు ఈ కేసులోని నిందితులుగా అనుమానిస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్ట చేశారు. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మిగిలిన నలుగురి కోసం అన్వేషణ కొనసాగుతోంది. కాగా గోద్రా కోలుకున్న తరువాత ఈ కేసులో మరికోందరి పేర్లు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more