మహిళతో పరిచయం ఏర్పర్చుకుని పరస్పర అంగీకారంతో శారీరక సంబంధం కొనసాగించడం.. ఆ తరువాత అమెతో పెళ్లికి నిరాకరించిన కేసులో బాంబే హైకోర్టు సంచలన తీర్పును వెలువరించ్చింది. పరస్పర అంగీకారంతో శారీరక సంబంధం కొనసాగించడం.. ఆపై అమెతో పెళ్లికి నిరాకరించడం మోసం చేసినట్టు కాదని ఓ కేసులో హైకోర్టు కీలకవ్యాఖ్యలు చేసింది. ఈ తరహా కేసులో కింది కోర్టు తీర్పు మేరకు ఏడాది పాటు కారాగారవాసం అనుభవించిన వ్యక్తిని దాదాపుగా పాతికేళ్ల తర్వాత నిర్దోషిగా ప్రకటించింది. పరస్పర అంగీకారంతో చేసిన శృంగారం ఎలా మోసం చేసినట్లు అవుతుందని న్యాయస్థానం ప్రశ్నించింది.
తనను పెళ్లి చేసుకుంటానన్న హామీతోనే నిందితుడు ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. నిజానికి పెళ్లికి నిరాకరించడం సెక్షన్ 417 కింద నేరం కాదని పేర్కొంది. ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని పాల్గఢ్కు చెందిన వ్యక్తి తనతో శారీరక సంబంధం పెట్టుకుని, ఆపై పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడంటూ 1996లో ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదైంది. ఈ కేసు విచారణ అనంతరం మూడేళ్ల తర్వాత పాల్గఢ్ అదనపు న్యాయమూర్తి నిందితుడిని దోషిగా తేల్చి ఏడాది జైలు శిక్ష, రూ. 5 వేల జరిమానా విధించారు.
దోషిగా తేలిన నిందితుడు పాల్గడ్ అదనపు న్యాయమూర్తి వేసిన ఏడాది కారాగారవాస శిక్షను అనుభవించిన తరువాత.. ఈ తీర్పును బాంబే హైకోర్టులో సవాలు చేశాడు. పాతికేళ్ల నాటి ఈ కేసును తాజాగా మహారాష్ట్ర రాష్ట్రోన్నత న్యాయస్థానం నిందితుడిని నిర్దోషిగా ప్రకటించింది. పరస్పర అంగీకారంతో ఏళ్లుగా శారిరిక సంబంధం పెట్టుకుని తరువాత నిందితుడి సమక్షంలో మోసం చేశాడని అనకుండా.. అతని వెనుక ఈ కుట్రను పన్నారని తెలుస్తోందని పేర్కోంది. పెళ్లి మాటను మహిళ ప్రస్తావించడం వారిద్దరూ పరస్పర అంగీకారంతోనే శారీరక సంబంధం పెట్టుకున్నట్టు సాక్ష్యాధారాలు ఉన్నాయని, అయితే, ఆమెను వివాహం చేసుకునే ఉద్దేశం అతడికి ఉన్నట్టు ఎలాంటి సాక్ష్యాలు లేవని తేల్చి చెప్పింది. ఫలితంగా 25 సంవత్సరాల తర్వాత నిందితుడు నిర్దోషిగా బయటపడ్డాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more