Petrol, Diesel Prices Touch All-Time Highs On Friday మళ్లీ పెరిగిన ఇంధన ధరలు.. చారిత్రక గరిష్ట స్థాయికి..

Petrol and diesel prices today touch all time high in india

Petrol Diesel prices, petrol diesel price hike, petrol prices in delhi, diesel prices in delhi, effect of covid 19 on petrol prices, effect of covid 19 on diesel prices, petrol price, petrol rate, petrol rate today India, diesel rate, diesel price, diesel rate today, diesel rate today in India, today petrol rate, today diesel rate, Petrol rate in Hyderabad, diesel rate in Telangana, diesel rate in Andhra Pradesh, diesel rate in Hyderabad, diesel rate in Guntur, diesel rate in Chennai, diesel rate in Vijayawada, diesel rate in Amaravati, diesel rate in Visakhapatnam, diesel rate in Delhi, diesel rate in Chennai, diesel rate in India, Petrol rate in Telangana, petrol rate in Andhra Pradesh, petrol rate in Delhi, petrol rate in Mumbai, Petrol rate in Hyderabad, Petrol rate in Visakhapatnam, fuel rates today in India, fuel rates, fuel price in India

Petrol and diesel prices today touched all-time high in Delhi and Mumbai after rates were hiked by oil marketing companies in the country. This comes as international oil prices are at three year high with global benchmark Brent trading at USD 78.64 per barrel.

మళ్లీ పెరిగిన ఇంధన ధరలు.. చారిత్రక గరిష్ట స్థాయికి..

Posted: 10/01/2021 12:40 PM IST
Petrol and diesel prices today touch all time high in india

డెబై ఏళ్ల స్వతంత్ర భారతావనిలో ఎన్నడూ ఎరుగని రీతిలో ఇంధన ధరలు పైపైకి ఎగబాగుతూ.. దేశ చరిత్రలో మునుపెన్నడూ లేని కొత్త ఎత్తును అందుకున్నాయి, జూలై నెల 17న తొలిసారిగా అత్యంత అధిక ధరలకు చేరిన చమురు ధరలు.. ఆ తరువాత మళ్లీ రెండు నెలల తరువాత ఆ ధరలను మించిపోయి అల్ టైమ్ హై స్థాయిని అందుకున్నాయి. చమురు ధరల పెంపుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నామని చె్ప్పిన కేంద్రం.. ఈ ఏడాది ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన మే 4 నుంచి వరుసగా ఇంథన దరలను పెంచూతూ వస్తోంది. ఫలితంగా దేశవ్యాప్తంగా అన్ని మెట్రో నగరాల్లో వంద రూపాయలు దాటిన ఇంధన ధర.. చారిత్రక గరిష్టాన్ని తాకింది.

చమురు కెంపెనీలు ఇంధన ధరలను మే నెలలో ఏకంగా 16 సార్లు పెంచూతూ నిర్ణయం తీసుకున్నాయి. జూన్ నెలలో 16 సార్లు ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. జూలైలో పది పర్యాయాలు పెంచాయి. అయితే ఇంధన ధరలను తగ్గించాల్సిందేనన్న డిమాండ్ పెల్లుబిక్కిన నేపథ్యంలో గత రెండు నెలలుగా ఇంధన ధరల జోలికి వెళ్లన చమురు సంస్థలు.. సెప్టెంబర్ నెలాఖరులలో మాత్రం మళ్లీ వాహనాదారులకు షాకిచ్చాయి. దీంతో దేశంలోని అనేక ప్రాంతాల్లో పెట్రోల్ ధర ఏకంగా రూ. 110 ల మార్కును అందుకునేలా వుంది. దేశ రాజధాని ఢిల్లీలోనూ పెట్రోల్ ధరల 101.89 రూపాయలుగా నమోదైంది.

కాగా, దీంతో పాటు దాదాపుగా దేశంలోని అన్ని మెట్రోపాలిటిన్ నగరాలతో పాటు 13 రాష్ట్రాల్లో పెట్రోల్ ధర రూ.110 మార్కును అందుకునేందుకు పరుగులు పెడుతొంది. ఇక తాజాగా డీజిల్ దర కూడా వంద మార్కును అందుకునే దిశగా కదులుతోంది. ఇప్పటికే రికార్డు స్థాయికి ధరలు చేరగా.. మరోసారి పెట్రోల్‌ లీటర్‌కు 25 పైసలు మేర పెంచిన ఇంధన సంస్థలు, డీజిల్‌ ధరపై ఏకంగా మరోమారు 30 పైసల మేర పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. మే 4 నుంచి ఇప్పటివరకు చమురు ధరను 44 పర్యాయాలు పెంచిన కేంద్రం.. మే నెల నుంచి తాజా పెంపు వరకు పెట్రోల్ పై రూ.11.54, డీజిల్‌పై 9.54 వరకు చమరు కంపెనీలు పెంచాయి. ఫలితంగా పెట్రోల్-డీజిల్ ధరలు దేశంలో రికార్డు స్థాయికి చేరుకుంది. రాజస్థాన్ సహా మధ్యప్రదేశ్ రాష్ట్రాలోని పలు ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర 110కి చేరుకోగా..  తెలుగు రాష్ట్రాల్లో లీటరు పెట్రోల్ ధర ఏకంగా రూ.107 దాటింది.

తాజాగా దేశవ్యాప్తంగా మెట్రో నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు ఎలా వున్నాయంటే...

ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర 101.89గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ.90.17కు చేరింది.
ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.107.95గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ.97.84కు చేరింది.
చెన్నైలో లీటరు పెట్రోల్ ధర రూ.99.58గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ.94.74కు చేరింది.
కొల్ కతాలో లీటరు పెట్రోల్ ధర రూ.102.47గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ.93.27కు చేరింది.
విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ..108.56 కాగా, లీటరు డీజిల్ ధర రూ.99.48కు చేరింది.
హైదారాబాద్ లో లీటరు పెట్రోల్ ధర రూ.106.00గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ. 98.39కు చేరింది.
బెంగళూరులో లీటరు పెట్రోల్ ధర రూ.105.44గా నమోదు కాగా, లీటరు  డీజిల్‌ రూ.95.70కు చేరింది.
పాట్నాలో లీటరు పెట్రోల్ ధర రూ.104.64గా నమోదు కాగా, లీటరు  డీజిల్‌ రూ. 96.40కు చేరింది.
భూపాల్ లో లీటరు పెట్రోల్ ధర రూ.110.37గా నమోదు కాగా, లీటరు డీజిల్ రూ.99.09కు చేరింది
చండీగఢ్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.98.08గా నమోదు కాగా, లీటరు  డీజిల్‌ రూ.89.90కు చేరింది.
లక్నోలో లీటరు పెట్రోల్ ధర రూ. 98.99గా నమోదు కాగా, లీటరు  డీజిల్‌ రూ.90.59కు చేరింది.
తిరువనంతపురంలో లీటరు పెట్రోల్ ధర రూ.104.13గా నమోదు కాగా, లీటరు డీజిల్‌ రూ.97.03కు చేరింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles