తెలంగాణలోని హాట్ సీటుగా ప్రాధాన్యత సంతరించుకున్న రాష్ట్ర ప్రజలతో పాటు తెలుగువారి దృష్టని ఆకర్షించింది హుజూరాబాద్ ఉపఎన్నిక. ఈ అసెంబ్లీ స్థానానికి ఉప-ఎన్నికల నగరా మ్రోగడంతో ప్రధాన పార్టీలు ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించాయి. అధికారికంగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యింది కాబట్టి ప్రచారాన్ని ముమ్మరం చేయాలని పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. అయితే ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని తమ శక్తిమేరకు పార్టీలో నిర్వహించాయి. అయితే ఎన్నికల నగరా మ్రోగిన నేపథ్యంలో ఈ ఇక ఇదే ఈ ఎన్నికలకు తుది ప్రచారం కానుంది. ఈ సీటులో కేసీఆర్ పంతం గెలుస్తుందా.? ఈటెల ఆత్మగౌరవం విజయం సాధిస్తుందా.? గెలుపెవరిదీ అన్న ఉత్కంఠ రేకెత్తుతోంది.
తెలంగాణ ప్రభుత్వంలో అరోగ్య మంత్రిగా కొనసాగిన ఈటెల రాజేందర్ భూకబ్జాలకు పాల్పడ్డాంటూ కొందరు రైతులు అరోపించారని, ఆయనను మంత్రి పదవి నుంచి ఉద్వాసన పలికిన నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ పార్టీలో రాజుకున్న రాజకీయ సెగ ఈటెల పార్టీకి, ఎమ్మెల్యే సభ్యత్వానికి దారి తీసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ఈ ఏడాది జూన్12న తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. అప్పటినుంచి రాష్ట్రంలో హాటు రాజకీయాలకు హుజూరాబాద్ వేదికగా మారింది.
ఒకవైపు ఈటెల ఆయన బీజేపి పార్టీ నేతలతో ఉపఎన్నికల ప్రచారంలో చాపకింద నీరులా దూసుకుపోతున్నారు, మరోవైపు టీఆర్ఎస్ మంత్రివర్గం, ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ కు అండగా ముమ్మరంగా ప్రచారం నిర్విహిస్తున్నారు. మరీ ముఖ్యంగా హరీశ్ రావు, గంగుల కమలాకర్ హుజూరాబాద్ లోనే తిష్టవేసిన మరీ ఎన్నికల ప్రచారం కొనసాగిస్తూనే.. గెలుపుకు వ్యూహాలను కూడా రచిస్తున్నారు. నియోజకవర్గంలోని ప్రతీ ఓటును ప్రతిష్టాత్మకంగా తీసుకుని మరీ గెలుపు వైపు మార్గాన్ని నిర్ధేశిస్తున్నారు.
ఈ క్రమంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న గెల్లు శ్రీనివాస్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ బీ-ఫారం అందించారు. హుజూరాబాద్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని, బీ-ఫారంతో వెళ్లి భారీ మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యేగా హైదరాబాద్ వస్తావంటూ శ్రీనివాస్ యాదవ్ను కేసీఆర్ ఆశీర్వదించారు. హుజూరాబాద్ టీఆర్ఎస్కు కంచుకోట అని, అక్కడ వ్యక్తులుగా కాకుండా పార్టీ ఎదిగిందని అన్నారు. పార్టీకి ద్రోహం చేసిన వారికి అక్కడ చోటు లేదన్నారు. అక్కడ మనదే గెలుపని సర్వేలన్నీ చెబుతున్నాయని అన్నారు. ఎన్నికల ప్రచార సభలో తాను కూడా పాల్గొంటానని ఈ సందర్భంగా కేసీఆర్ పేర్కొన్నారు. ఎన్నికల ఖర్చు నిమిత్తం రూ. 28 లక్షల చెక్కును ఈ సందర్భంగా శ్రీనివాస్ కు అందజేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more