మాజీమంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నీళ్లు, నియామకాలు, నిధుల కోసం జరిగిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం తరువాత.. గత ఏడేళ్లుగా టీఆర్ఎస్ పార్టీ ప్రముఖుల చేతిలోనే అవి బంధించబడ్డాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న సీఎం కేసీఆర్.. మాయమాటలు చెబుతూ ప్రజల దృష్టిని మరల్చాలని చూస్తున్నారని విమర్శించారు. నిరుద్యోగలకు భృతి కల్పిస్తానని రెండేళ్ల క్రితం చేసిన వాగ్ధనం ఏమైందని ఆయన ప్రశ్నించారు.
తనను ఎలాగైనా ఒడించాలని పంతం పట్టి మంత్రుల దండుతో పాటు ఎమ్మెల్యేలను కూడా పంపి.. హుజూరాబాద్ లో ఓ రకమైన ఎమర్జెన్సీ వాతావరణాన్ని తీసుకోచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మంత్రి హరీష్ రావుకు దమ్ము, ధైర్యం వుంటే.. వారిని వీరిని ఎంచుకోవడం ఎందుకు.. నేరుగా వారే తనతో తలపడవచ్చునని సవాల్ విసిరారు. ఉద్యమ ద్రోహులను అందలం ఎక్కించడం ఎంతవరకు సమంజసమని ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ ను నిలదీశారు. ఉధ్యమంలో తన వెంట ఉన్నవారిని ఇప్పడు బయటకు తోసి.. బయట ఉన్నవారిని ఎందుకు పార్టీలో చేర్చుకుంటున్నారో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ఏడేళ్లలో సీఎం ఆఫీస్ లో ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అధికారి నియామకం జరగలేదన్నారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఎక్కడ కూడా అములు కాలేదని చెప్పారు. దళితుల జీవితాల్లో వెలుగు నింపలేదని విమర్శించారు. దళితులకు ముఖ్యమంత్రి పదవి కాదు ఇచ్చిన ఉపముఖ్యమంత్రి పదవిని కూడా మున్నాళ్ల ముచ్చటే చేశాడని విరుచుకుపడ్డారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు రూ.3116 భృతి ఇస్తామన్న వాగ్ధానాన్ని కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే నిలుపుకోవాలని డిమాండ్ చేశారు. దళితబంధు పథకాన్ని యావత్తు తెలంగాణకు వర్తింపజేయాలని అన్నారు.
తనను బక్కపల్చని పిల్లగాడు, దిక్కులేని పిల్లగాడు అని అంటున్నారని, కానీ హుజూరాబాద్ ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్నానని అన్నారు. ఓటుకు రూ. 10 వేలు ఇచ్చినా సరే ప్రజల గుండెల్లోంచి తనను తుడిచేయలేరని స్పష్టం చేశారు. ఉరుములు వచ్చినా, పిడుగులు పడినా తన గెలుపును ఎవరూ ఆపలేరని ఈటల ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో రూ. 1000 కోట్లు ఖర్చు చేస్తామని చెబుతున్నారని, అయినా ఫర్వాలేదని, ఎన్నికల్లో చూసుకుందామని అన్నారు. ముఖ్యమంత్రి మాటల్లో, చేతల్లో నిజాయతీ లేదన్న ఈటల.. న్యాయబద్ధంగా పోటీ చేస్తే వారికి డిపాజిట్ కూడా దక్కదన్నారు. తాను మచ్చలేని వ్యక్తినని, కక్ష గట్టి తనను తప్పించారని ఆరోపించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more