దేశంలోని పోలిస్ స్టేషన్లలో ఇప్పటికీ మానవ హక్కులకు, మనిషి గౌరవానికి అత్యధిక ముప్పు’ ఏర్పడుతోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్న తరుణంలో జరిగే కస్టోడియల్ చిత్రహింసలతో పాటు పోలీసుల దౌర్జన్యాలు కూడా ఇంకా స్వతంత్ర భారతావనిలో రాజ్యమేలుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసుల అదుపులోకి వెళ్లిన విశేషాధికారం వున్నవారు కూడా వారి ధర్డ్ డిగ్రీ చర్యలకు అతీతులు కారని ఆన అన్నారు, మానవహక్కులు, గౌరవం అనేవి ‘పవిత్రమైనవని’ ఆయన పేర్కోన్నారు.
‘‘రాజ్యాంగపరమైన నిర్దేశాలు, హామీలు ఉన్నప్పటికీ ఠాణాలలో మాత్రం న్యాయపరమైన ప్రాతినిధ్యం లేకపోవడం అరెస్ట్/నిర్బంధంలో ఉన్నవారికి పెనుశాపంగా మారుతోంది. నిందితుడు తొలి గంటల్లో తీసుకున్న నిర్ణయాలు తర్వాత తనను తాను రక్షించుకునే సామర్థ్యాన్ని నిర్ణయిస్తుంది’’ అని జస్టిస్ రమణ పేర్కొన్నారు. పోలీసుల మితిమీరిన చర్యలకు నియంత్రణలో ఉంచేందుకు రాజ్యాంగ హక్కులు, ఉచిత న్యాయ సేవల లభ్యతపై ప్రజలకు సమాచారాన్ని అందించడం.. విరివిగా ప్రచారం చేయడం అవసరమని ఆయన వ్యాఖ్యానించారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ (ఎన్ఏఎల్ఎస్ఏ) నిర్వహించిన పోలీసు అధికారుల సంచలనాలు అనే అంశంపై అంశంపై ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు,
ఇటీవల వచ్చిన వార్తలను బట్టి చూస్తుంటే విశేషాధికారాలు ఉన్న వారు కూడా థర్డ్-డిగ్రీకి అతీతులు కారని అర్థమైందని చీఫ్ జస్టిస్ పేర్కొన్నారు. అయితే, ఆయన ప్రత్యేకంగా ఏ కేసునూ ఉదహరించలేదు. పోలీసు అధికారులకు కూడా వీటిపై అవగాహన కల్పించాలని అన్నారు. ఇందులో భాగంగా ప్రతి పోలీస్ స్టేషన్, లేదంటే జైలులో డిస్ ప్లే బోర్డులు, అవుట్ డోర్ హోర్డింగులను ఏర్పాటు చేయడం ఈ దశలో ఓ ముందడుగు అవుతుందన్నారు. ఈ సందర్భంగా ఉచిత న్యాయ సేవల కోసం ఎన్ఏఎల్ఎస్ఏ రూపొందించిన మొబైల్ యాప్ ను జస్టిస్ ఎన్వీ రమణ ప్రారంభించారు. ఈ యాప్ పేదలు, అవసరంలో వున్న ప్రజలకు న్యాయసేవను ఉచితంగా అందిస్తుందని అన్నారు. బాధితులకు నష్టపరిహారాన్ని కూడా అందజేస్తుందని ఎన్వీ రమణ తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more