హుజూరాబాద్ ఈటెలదేనని.. ఆక్కడ జరగనున్న ఉప ఎన్నికలలోనూ ఈటెల రాజేందర్ గెలుపు తథ్యమని అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. హుజురాబాద్ లో జరగనున్న ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ తన ఆత్మగౌరవానికి ప్రతీకగా తీసుకోవడంతోనే ఆయనకు జనం అండగా నిలిచారని అన్నారు వెంకట్ రెడ్డి. ఇక్కడ పార్టీల మధ్య పోరుగా కాకుండా రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వానికి.. ఈటెల ఆత్మగౌరవానికి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పుకోచ్చారాయన.
హుజురాబాద్ ఉపఎన్నికలపై ప్రస్తుత తాజా పరిస్థితుల నేపథ్యంలో తాను చేయించిన సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయని ఆయన తెలిపారు. ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న తమ పార్టీ అభ్యర్థికి కేవలం ఐదు శాతం ఓట్లు మాత్రమే పోలయ్యే అవకాశాలు వున్నాయని అన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎంత గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నా.. ఇక్కడ టీఆర్ఎస్ కు కూడా పెద్దగా ఓట్లు రాలే అవకాశాలు లేవని తన సర్వే తెలిపిందని అన్నారు. హుజురాబాద్ ఉపఎన్నికలలో ఈటెలకు ఏకంగా 67 శాతం మంది ఓటర్లు బ్రహ్మరథం పట్టనున్నారని, ఇకటీఆర్ఎస్కు 30 శాతం ఓట్లు వస్తాయని పేర్కొన్నారు.
అయితే, కాంగ్రెస్ తన అభ్యర్థిని ప్రకటించి ప్రచారాన్ని ముమ్మరం చేస్తే కొంత మార్పు వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా కాంగ్రెస్ జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందన్నారు. నల్గొండ, భువనగిరి లోక్సభ పరిధిలోని అన్ని ఎమ్మెల్యే స్థానాల్లోనూ కాంగ్రెస్ను గెలిపించడమే తన లక్ష్యమని వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణలో పాలన కేటీఆర్ మిత్రుడు, ఆర్థిక కుంభకోణాలకు పాల్పడి ఏడేళ్లు జైలు శిక్ష అనుభవించిన సత్యం రామలింగరాజు కుమారుడు తేజరాజు చేతిలో ఉందని ఆరోపించారు. నిన్న ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో విలేకరులతో మాట్లాడుతూ వెంకటరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more