ఇజ్రాయిల్ కు చెందిన పెగాసస్ స్పైవేర్ తో దేశంలోని పలువురు ప్రముఖుల ఫోన్లు హ్యాక్ అవుతున్నాయన్న వార్త కథనంతో పార్లమెంటు ఉభయ సభల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అంతేకాదు ఈ వార్తతో దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేగుతోంది. కేంద్రం హోం మంత్రి అమిత్ షాను తన పదవికి రాజీనామా చేయాలన్న విపకాల డిమాండ్ కు రానురాను బలం పెరుగుతోంది. దీంతోపాటు పెగసెస్ హ్యాకింగ్ ఘటనపై స్వతంత్ర సంస్థలతో దర్యాప్తు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా పెగాసెస్ స్పైవేర్ పై అట్టుడికిపోతున్న తరుణంలో తాజాగా తెరపైకి కొత్త కథనాలు వస్తున్నాయి,
తాజాగా పెగాసస్ విషయంలో అనిల్ అంబానీ పేరు తెరమీదకు వచ్చింది. ట్యాపింగ్ చేసేందుకు ఫోకస్ పెట్టిన ఫోన్ల నెంబర్ల జాబితాలో రిలయన్స్ అడాగ్ గ్రూపు చైర్మన్ అనిల్ అంబానీకి చెందిన నెంబర్లు ఉన్నాయంటూ ‘ది వైర్’ రాసుకొచ్చింది. 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో భారీ కుంభకోణం జరిగిందంటూ కాంగ్రెస్ ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. రాఫెల్ యుద్ధ విమానాలను తయారుచేసే సంస్థ డసాల్ట్కు ఇండియన్ పార్టనర్ గా అనిల్కు చెందిన సంస్థను ఎంపిక చేశారని… దాని వెనుక ఆయన్ను ఆయాచిత లబ్ది చేకూర్చే ప్రయత్నం ఉందని ఆరోపణలు వచ్చాయి.
నిఘా జాబితాలో డసాల్ట్ ఏవియేషన్ భారత ప్రతినిధి వెంకటరావు పోసీన, బోయింగ్ ఇండియా బాస్ ప్రత్యూష్ కుమార్ నెంబర్లు ఉన్నాయని వైర్ వెల్లడించింది. దలైలామా సన్నిహిత సలహాదారులపై కూడా నిఘా కొనసాగిందని వైర్ వెల్లడించింది. గురువారం.. ప్రభుత్వంతో విభేదాల అనంతరం సీబీఐ మాజీ డైరెక్టర్ అలోక్ వర్మను 2018లో పదవిలో నుంచి తొలగించగానే ఆయన ఫోన్ పైనా నిఘా పెట్టారు. ఈ పెగాసస్ స్కాండల్ ను వాటర్ గేట్ కంటే పెద్దదిగా అభివర్ణిస్తుంది ప్రతిపక్షం. కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ, పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్, ఇద్దరు కేంద్ర మంత్రులు, డజన్ల కొద్దీ జర్నలిస్టులు ఈ నిఘా జాబితాలో ఉన్నట్లు రిపోర్టులు చెబుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more