జమ్మూకశ్మీర్ లో మరోమారు డ్రోన్ సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. ఇరవై ఐదు రోజుల వ్యవధిలో ఎనమిదవ డ్రోన్ భారత్ లో సంచరించడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది, జమ్మూలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ పై నిన్న డ్రోన్ సంచరించడంతో అప్రమత్తమైన బధ్రతాబలగాలు ఇవాళ ఉదయం మరోమారు భారత సరిహద్దు భూబాగంలో సంచరించిన డ్రోన్ జమ్మూ పోలీసులు దాడి జరిపి నేలకూల్చారు. కాగా, ఈ డ్రోన్ ద్వారా ఉగ్రవాదులు మరోమారు భారత్ లో విద్వంసం సృష్టించాలని కుట్ర చేయగా దానిని జమ్మూ పోలీసులు భగ్నం చేశారు.
ఇవాళ జమ్ములో నెలకూల్చిన డ్రోన్లో పేలుడు పదార్థాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటన ఈ రోజు తెల్లవారుజామున జమ్మూలోని సరిహద్దు నియంత్రణ రేఖకు సమీపంలోని అక్నూర్ ప్రాంతానికి చేరువలోని గుర్హ పఠానిలో చోటు చేసుకుంది. డ్రోన్లో ఐదు కిలోల పేలుడు పదార్థాలు ఉన్నాయని, వాటిని స్వాధీనం చేసుకున్నామని అధికారులు ప్రకటించారు. స్వాధీనం చేసుకున్న ఈ ఐడీఈ పదార్థాలను తరువాత కాల్చివేశామని పోలీసులు తెలిపారు. ఈ డ్రోన్కు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని అన్నారు. 2019 నుంచి పాక్ భారత్లోకి డ్రోన్ల ద్వారా పేలుడు పదార్థాలు, డ్రగ్స్ పంపే చర్యలకు పాల్పడుతోంది.
ఇటీవల జమ్మూ ఎయిర్ బేస్లో చోటు చేసుకున్న డ్రోన్ దాడి నేపథ్యంలో భద్రతా బలగాలు డ్రోన్లపై నిఘా పెంచాయి. డ్రోన్లను రాడార్లు, యాంటీ డ్రోన్ సిస్టమ్స్ సాయంతో గుర్తించి పాక్ చర్యలను భారత సైన్యం తిప్పికొడుతోంది. కొన్ని డ్రోన్లు తప్పించుకుని వెనక్కి వెళ్లిపోతున్నప్పటికీ కొన్నింటిని మాత్రం భారత సైన్యం కూల్చేయగలుగుతోంది. డ్రోన్ల ద్వారా జరిగే దాడులను ముందుగానే పసిగట్టి తిప్పి కొట్టేందుకు ఏర్పాటు చేసుకుని అప్రమత్తంగా ఉంది. అయితే ఉగ్రవాదులకు పాకిస్థాన్ ప్రభుత్వ సహకారం పూర్తిగా లభిస్తోందని భారత అర్మీ వర్గాలు అరోపిస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more