పెగాసస్ స్పై వేర్ హ్యాకింగ్ వివాదం నేపథ్యంలో రేపు తెలంగాణ రాజ్ భవన్ ను ముట్టడించనున్నట్టు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి తెలిపారు. నిన్న ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో విలేకరులతో మాట్లాడిన ఆయన.. పెగాసస్ సాఫ్ట్ వేర్ వినియోగంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) లేదంటే దేశసర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాదులపై నిఘా వేసేందుకు ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసిన ఈ సాఫ్ట్ వేర్ ను ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేసేందుకు ప్రభుత్వం ఉపయోగిస్తోందని ఆరోపించారు.
దేశంలో 121 మంది పెగాసిస్ బాధితులు ఉన్నట్టు ఐటీశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ గతంలో చెప్పారని, ఇప్పటి ఐటీ మంత్రి ఈ సాఫ్ట్ వేర్ ఎక్కడుందని ప్రశ్నించడం ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని బయట పెడుతోందన్నారు. తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వం కూడా 2015 నుంచి ప్రతిపక్ష నేతల ఫోన్లు, పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోన్లు ట్యాప్ చేస్తోందన్నారు. ఇంటెలిజెన్స్ ఐజీ ప్రభాకర్ రావు నేతృత్వంలో సాఫ్ట్ వేర్ కొనుగోలు చేసి 50 మంది ప్రైవేటు హ్యాకర్లతో కాంగ్రెస్ నేతలు, మీడియా ప్రతినిధులు, న్యాయమూర్తుల ఫోన్లను పరిశీలిస్తున్నారని ఈ నెల 16నే చెప్పానని గుర్తు చేశారు.
పెగాసస్ సాఫ్ట్ వేర్ ను ప్రముఖుల ఫోన్ల ట్యాపింగ్ కు వినియోగిస్తున్నందుకు నిరసనగా దేశవ్యాప్తంగా రేపు రాజ్ భవన్ ల ముట్టడికి ఏఐసీసీ పిలుపునిచ్చినట్టు చెప్పారు. ఇందులో భాగంగా రేపు హైదరాబాదులోని రాజ్ భవన్ ను ముట్టడించనున్నట్టు చెప్పారు. పెగాసస్ పై నిష్పక్షపాత విచారణకు వీలుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు. కాగా, రేవంత్ రెడ్డి, పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ నిన్న రాహుల్ గాంధీని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై చర్చించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more