కరోనా వైరస్ మహమ్మారి రెండో దశ దేశవ్యాప్తంగా విలయాన్ని సృష్టిస్తోంది. గత ఏడాది దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన కేంద్రం ఈ సారి మాత్రం నియంత్రణ చర్యలకు పూనుకోవాలని రాష్ట్రాలకు పగ్గాలను అప్పగించింది. దీంతో రెండో దశ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో మహారాష్ట్రం, కర్ణాటక, తమిళనాడు సహా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు లాక్ డౌన్ విధించాయి. ఈ క్రమంలో తెలంగాణలో లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో కరోనా కేసులలో నియంత్రణ సాధించవచ్చునని, ఈ విషయంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన రోజునే ప్రభుత్వ సీఎస్ సోమేష్ కుమార్ రాష్ట్రంలో లాక్ డౌన్ విధించేది లేదని స్పష్టం చేశారు.
కాగా ప్రధానమంత్రితో ఫోన్ లో మాట్లాడిన సీఎం కేసీఆర్ ఈ నెల 12 నుంచి రాష్ట్రంలో లాక్ డౌన్ విధిస్తున్నట్లు వెల్లడించారు. అది మొదలు తెలంగాణలో రెండో పర్యాయం లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది. ఇక ఆ తరువాత మరో పది రోజుల పాటు లాక్ డౌన్ ను ఈ నెల 17నే పొడిగించారు సీఎం కేసీఆర్. మంత్రిమండలి సమావేశంలో చర్చ అనంతరం నిర్ణయం తీసుకుంటామని ముందుగా చెప్పినా.. మంత్రులతో ఫోన్ లో సంభాషించిన తరువాత ఆయన ఈ నిర్ణయానికి వచ్చారని సమాచారాన్ని అందించారు. అయితే ఇక మరో మూడు రోజుల్లో లాక్ డౌన్ ముగుస్తుందన్న నేపథ్యంలో మరో వారం రోజుల పాటు లాక్ డౌన్ పొడగించనున్నారన్న వార్తలు చక్కర్లు కోడుతున్నాయి.
ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ అధికారులు మరో వారం రోజుల పాటు లాక్ డౌన్ పోడగించాలని సీఎం కేసీఆర్ ను కోరారు. రాష్ట్రంలో గత పక్షం రోజుల లాక్ డౌన్ కారణంగా కరోనా కేసులు తగ్గముఖం పట్టాయని, మరో వారం రోజుల పాటు లాక్ డౌన్ పోడిగిస్తే మరింతగా తగ్గుతాయని వైద్యారోగ్య శాఖ అధికారులు సీఎం కేసీఆర్ కు సూచించారని సమాచారం. ఈ మేరకు వారు రూపోందించిన ఓ నివేదికను ముఖ్యమంత్రికి అందించారని, దీనిపై ఇక సీఎం కేసీఆర్ తుది నిర్ణయం తీసుకుంటారని వారు తెలిపారు. వారం రోజుల తరువాత కూడా మరో పది రోజుల పాటు రాష్ట్రంలో రాత్రి వేళ కర్ఫ్యూ విధించనున్నారన్న వార్తలు కూడా వినబడుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more