దేశవ్యాప్తంగా ఫాస్ట్ ట్యాగ్ ను తప్పనిసరి చేసిన కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ అదే సమయంలో వాహనదారులకు కూడా మినహాయింపులు కల్పించింది. నిజానికి చెప్పాలంటే దేశవ్యాప్తంగా నూతన రోడ్డు రవాణ చట్టాన్ని తీసుకువస్తూ.. పలు సవరణలు చేసిన కేంద్రం.. అదే సమయంలో పలు మినహాయింపులను తీసుకువచ్చింది. దీంతో 2018లోనే టోల్ గేట్ నిర్వాహకులతో వాహనదారులు కూడా వాగ్వాదానికి దిగారు. ఎందుకంటే అప్పట్లో పలు పత్రికల్లో ఓ వార్త సంచలనంగా మారింది. అదేంటంటే టోల్ గేట్ల వద్ద వాహనాలు పసుపు వర్ణం గీతను దాటితే టోల్ టాక్స్ తీసుకోకూడదన్న నిబంధన పోందపర్చి ఉండటమే అందుకు కారణం.
అయితే ఈ వార్త వచ్చిన విషయం కొందరు వాహనదారులకు మాత్రమే తెలుసు. ఇక పలు వాహనాదారులతో పాటు టోల్ ప్లాజాలలోని ఉధ్యోగులకు కూడా ఈ విషయం తెలియకపోవడం గమనార్హం. దీంతో తెలిసిన వారు నిర్వాహకులతో వాగ్వాదానికి కూడా దిగారు. అయితే తమకు అలా అని ఎలాంటి సూచనలు రాలేదని చెప్పడంతో పాటు బిక్కముఖం వేయడం అక్కడి ఉద్యోగుల వంతు అయ్యింది. అయితే తాజాగా కేంద్ర రోడ్డు రవాణ, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ఈ మేరకు కొత్తగా ప్రకటన విడుదల చేసింది. దీంతో వాహనదారులకు తాము ఎదురుచూస్తున్న శుభవార్త అందింది.
ప్రతి టోల్ బూత్ వద్ద 100 మీటర్ల దూరంలో పసుపు గీతలు గీయాలని నిర్ణయించింది. టోల్ చెల్లించే సమయంలో వాహనాల బారు ఆ గీతను దాటితే ఇక టోల్ చెల్లించాల్సిన అవసరం ఉండదు. అప్పటి వరకు క్యూలో ఉన్న వాహనాలన్నింటినీ రుసుము వసూలు చేయకుండానే వదిలేయాల్సి ఉంటుంది. ఇక దీంతో పాటు ఏదేని వాహనానికి పది సెకన్ల కన్నా ఎక్కువ సమయం వేచి వుండాల్సి వస్తే ఆ వాహనాలకు కూడా టోల్ పన్ను మినహాయించాల్సిందేనని జాతీయ రహదారుల సంస్థ నిర్ణయించింది. వాహనదారుల కష్టాలు తీర్చే ఉద్దేశంతోనే ఎన్హెచ్ఏఐ ఈ నిర్ణయం తీసుకుంది. టోల్ప్లాజాల వద్ద నిరీక్షణ సమయాన్ని కుదించేందుకే ఈ నిర్ణయం తీసుకుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more