దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని బివాండీ ప్రాంతానికి చెందిన బాలా కోలి అనే వ్యక్తి తన పెళ్లి రోజు సందర్భంగా తన భార్యకు ఏకంగా కిలో అంటే 1000 గ్రాముల బరువున్న బంగారు మంగళసూత్రాన్ని కానుకగా అందించడం.. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. దీంతో పోలీసులు భర్తను విచారించగా.. అతడు చెప్పిన మాటలు విని.. విస్తుపోయారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. పెళ్లైన మహిళలు మెడలో రెండు నుంచి నాలుగు, ఐదు తులాల మేర అంటే 50 గ్రాముల బరువున్న మంగళసూత్రాలు వారి వారి ఆర్థిక తాహత్తు మేర చేయించుకుంటారు. కానీ ఎవరి మెడలోనూ ఏకంగా కేజీ బంగారు మంగళసూత్రం ఉండదు. ఇంకా డబ్బుంటే ఏడు వారాల నగలు చేయించుకుంటారే కానీ కేజీ బంగారంతో తాళి చేయించుకుని మెడలో వేసుకుంటే అది వింత, విచిత్రమే.
మహారాష్ట్రకు చెందిన ఓ మహిళకు తమ పెళ్లి రోజు సందర్భంగా కేజీ బంగారంతో మంగళసూత్రాన్ని చేయించిన భర్త అమెకు కానుకగా ఇచ్చాడు. ఈ విషయం కాస్తా వైరల్ గా మారడంతో ముంబై పోలీసులు సదరు వ్యక్తిని పిలిచి విచారించారు, ‘ఏందీ భారీ మంగళసూత్రం’ కథా కమామీషు.. అంత డబ్బు ఎక్కడ నుంచి తీసుకువచ్చావ్.? అంటూ అన్ని కోణాల్లో విచారించగా, తొలుత గొప్పలకు పోయిన బాల కోలి.. తమదైన స్టైయిల్లో పోలీసులు గధ్దించి అడగంలో అసలు విషయం చెప్పేశాడు. తన భార్యకు గిఫ్టుగా ఇచ్చిన ఒక కేజీ బంగారు మంగళసూత్రం నిజమైనది కాదని.. నకిలీ బంగారం (గిల్టు) అని చెప్పాడు. బంగారు షాపు నుంచి 38వేల రూపాయలకు కొన్నానని చెప్పటంతో పోలీసులు షాక్ అయ్యారు.
దీంతో పోలీసులు అది నిజమా? కాదా? అని విచారించి.. బాలా చెప్పింది నిజమేనని నిర్థారించుకున్న తరువాత వదిలేశారు. ఇక ఈ ఘటనపై ఓ పోలీస్ అధికారి మాట్లాడుతూ.. ‘‘ కేజీ బంగారు తాళి వీడియో వైరల్ మా దృష్టికి రావటంతో చోరీలు జరుగుతున్న క్రమంలో అది వారికి ప్రమాదమని..దాంతో అతడిని ఎంక్వయిరీకి పిలిపించామని తెలిపారు. అలాగే ఇలా బంగారు నగలు అని పబ్లిసిటీ చేసుకుంటే అది ప్రమాదాలకు దారి తీస్తుందనీ..ఇటువంటి పబ్లిసిటీలు దొంగల్ని ఆహ్వానించటమే. ప్రాణాలమీదకు తెచ్చుకోవటమనేనని తెలిపారు. అందుకే బాలా కోలిని పోలీస్ స్టేషన్కు పిలిపించామని తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more