కరోనా వ్యాక్సినేషన్ కోసం ఇదివరకే కేంద్రప్రభుత్వం పలు మార్గదర్శకాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే కేంద్రం మార్గదర్శకాలకు అనుగూణంగా మరో నూతన విధానాన్ని తీసుకువస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాక్సీనేషన్ ప్రక్రియలో ఫ్రంట్ లైన్ వారియర్స్ కు ఇచ్చిన ప్రాధాన్యత క్రమంలోనే సూపర్ స్పెడర్స్ కు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు కరోనా వ్యాక్సినేషన్ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఇక వీరితో పాటు తొలుత 30 ఏళ్లు పైబడిన వారికి ప్రాధాన్యతా క్రమంలో వ్యాక్సిన్ ఇవ్వాలని యోచిస్తున్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ వారి అవసరాలను ఎరిగి అత్యవసర సరుకులను అందించే వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నారు. వీరిలో ముఖ్యంగా పాలు, కూరగాయలు, గ్యాస్ డెలివరీ బాయిస్, మెడికల్ షాపు సిబ్బంది, నిత్యావసర సరుకుల విక్రయదారులు, రేషన్ షాపుల డీలర్లు, సిబ్బందిని పలు వర్గాలుగా విభజించి.. ప్రాధాన్యత క్రమంలో వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది.
వైద్య ఆరోగ్య శాఖతో పాటు..రాష్ట్రంలో కొనసాగుతున్న లాక్ డౌన్ అంశంపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో ఇవాళ సమీక్షసమావేశం నిర్వహించారు. మంత్రి హరీష్ రావుతో పాటు సీఎస్ సోమేష్ కుమార్, పోలీసు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానంగా వ్యాక్సినేషన్ తో పాటు కొనసాగుతున్న లాక్ డౌన్ కొనసాగింపుపై చర్చిస్తున్నారు. నాలుగు కోట్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వాలని, ఇందుకు రూ. 2 వేల 500 కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం భావించింది. కానీ.. ప్రస్తుతం సెకండ్ డోస్ దొరకని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో..ప్రభుత్వం గ్లోబల్ టెండర్స్ లు పిలుస్తోంది. మొదటగా ఫ్రంట్ లైన్ వారియర్స్ కు వ్యాక్సిన్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
జనాభాకు అనుగుణంగా వ్యాక్సిన్ అందడం లేదు. అందులో భాగంగా..వ్యాక్సిన్ పాలసీని రూపొందించింది. పోలీసు విభాగంతో పాటు ఫ్రంట్ లైన్ వారియర్స్ కు వ్యాక్సిన్ ఇవ్వాలని తాజాగా నిర్వహించిన ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 55 లక్షల 28 వేల మందికి పైగా ఫస్ట్ డోస్, 10 లక్షల 74 వేల మందికి వ్యాక్సిన్ వేసింది. ఇప్పటి వరకు కొవిషీల్డ్, కొవాగ్జిన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. స్పుత్నిక్, ఫైజర్ లను కొనుగోలు చేసి రాష్ట్ర ప్రజలకు వ్యాక్సిన్ లను వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. 30 ఏళ్ల పైబడిన వారికి, సూపర్ స్ప్రైడర్స్కి వ్యాక్సిన్ ఇవ్వాలని, వచ్చే వారం రోజుల్లో మొదటి డోస్ అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more