దేశంలో కరోనా వాక్సీన్ల కొరత ఏర్పడిన నేపథ్యంలో కేంద్రప్రభుత్వం 18 ఏళ్లకు పైబడిన యువతకు కూడా కరోనా టీకాలు ఇస్తూ ఏప్రిల్ నెలలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే అసలే దేశంలో కోవిడ్ టీకాల కోరత ఏర్పడిన తరుణంలో ఈ నిర్ణయం తీసుకోవడం.. అందునా అదే సమయంలో దేశంలో రెండో దశ కరోనా ఉద్దృతి కొనసాగడంతో కరోనా టీకాలు హాట్ కేకుల మాదిరిగా రోజుల వ్యవధిలోనే పూర్తి అయిపోయాయి. ఇక వాక్సీన్ల కోసం ఎంతో మంది వస్తున్నా.. లక్షలాది మంది ప్రభుత్వ అసుపత్రుల వద్ద బారులు కట్టినా లాభం లేకుండా పోయింది. ఈ క్రమంలో కోవిన్ యాప్ ద్వారా ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న తరువాత వాక్సీన్ తీసుకోవాలన్న నిబంధనపై విమర్శలు వెల్లువెత్తాయి.
దీంతో ఎట్టకేలకు కేంద్రప్రభుత్వం దిగివచ్చింది. మరీ ముఖ్యంగా 18 ఏళ్లు నిండిన వారు ఇకపై కోవిన్ యావ్ లో ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన పనిలేదని, కోవిడ్ టీకాలు ఇచ్చే కేంద్రాల వద్దకు వచ్చి అక్కడే వాక్సీన్లు తీసుకున్నా సరిపోతుందని కేంద్రప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కోవిడ్ టీకాలు ఇకపై స్పాట్ లోనే రిజస్ట్రేషన్ చేసుకునే వెసలుబాటు కల్పించింది. ఇలా వెసలుబాటు ఇవ్వడానికి కూడా కారణం వుంది. అదేంటంటే.. చాలా ప్రాంతాల్లో టీకా డోసులు ముందుగా బుక్ చేసుకుని, తమకు నిర్దేశించిన రోజున వారు రాకపోవడంతో ఆ డోసులు వృథా అయ్యాయి. దీన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై 18 ఏళ్ల నుంచి 44 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదని పేర్కోంది.
18 ఏళ్లు నిండిన వారు వ్యాక్సిన్ కేంద్రాల వద్దకు వెళ్లి డోసులు వేయించుకోవచ్చని కేంద్రం స్పష్టం చేసింది. కొవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ల వద్దే అప్పటికప్పుడు తమ పేరు, ఇతర వివరాలు నమోదు చేయించుకుని వ్యాక్సిన్ పొందవచ్చని ఓ ప్రకటనలో వివరించింది. అంతర్జాల సదుపాయం లేనివారు, ఫోన్ లేని వారికి కూడా ఈ సదుపాయం వర్తింపచేస్తున్నట్టు వెల్లడించింది. అయితే, ఇది తమ నిర్ణయం మాత్రమేనని, దీన్ని అమలు చేసే విషయంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు స్వేచ్ఛ ఇచ్చామని కేంద్రం తెలిపింది. ఒకవేళ రాష్ట్రాలు తమ ప్రతిపాదనకు సమ్మతిస్తే... ఈ ఆన్ సైట్ రిజిస్ట్రేషన్ కేవలం ప్రభుత్వ కొవిడ్ టీకా కేంద్రాల వద్దనే అమలు చేయాలని, ప్రైవేటు టీకా కేంద్రాల వద్ద స్పాట్ రిజిస్ట్రేషన్లు చేపట్టవద్దని స్పష్టం చేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more