ఇంధన ధరలను ఇకపై పెంచేది లేదని, ధరల పెంపుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నామని ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముందు బీరాలు పోయిన కేంద్ర ప్రభుతం.. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత వరుసగా ఇంథన దరలను పెంచూతూ వస్తోంది. ఈ క్రమంలో శని, అది వారాలు ధరల పెంపుకు బ్రేకులు వేసిన ఇంధన సంస్థలు ఇవాళ మరోమారు వాటిని విదిల్చాయి. దీంతో దేశంలోని పలు రాష్ట్రాలలో ఇప్పటికే పెట్రోలు ధర లీటరుకు వంద రూపాయల మార్కును ధాటింది. అన్ లాక్ నేపథ్యంలో గత ఏడాది జూన 1 నుంచి అంతకంతకూ పెరుగుతూ వస్తున్నాయి.
అంతర్జాతీయంగా పెద్దగా ధరల ప్రభావం లేకపోయినా దేశంలో మాత్రం ఇంధన ధరలకు రెక్కలు వస్తున్నాయి. వారంతపు సెలవులో యధాతథంగా కొనసాగిన ఇంధన ధరలు ప్రస్తుతం మరోమారు పెరిగాయి. ఈ మేరకు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. లీటరు పెట్రోల్పై 26 పైసలు.. లీటరు డీజిల్ పై 33 పైసల మేర ధరను పెంచాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ రూ.91.53 కి చేరగా, లీటరు డీజిల్ ధర రూ.82.06కు చేరింది. దీంతో పలు నగరాల్లో పెట్రోల్ ధర ఏకంగా రూ.100 మార్కును దాటగా, పలు నగరాల్లో 100 మార్కును అందుకునేందుకు పరుగులు తీస్తోంది, తాజాగా దేశవ్యాప్తంగా మెట్రో నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు ఎలా వున్నాయంటే...
ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర 91.53గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ. 82.06కు చేరింది.
ముంబైలో లీటరు పెట్రోల్ ధర 97.86గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ. 89.17కు చేరింది.
చెన్నైలో లీటరు పెట్రోల్ ధర 93.38గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ. 86.96కు చేరింది.
కొల్ కతాలో లీటరు పెట్రోల్ ధర 91.66గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ. 84.90కు చేరింది.
అమరావతి గుంటూరులో పెట్రోల్ ధర రూ, 97.53 కాగా, లీటరు డీజిల్ ధర రూ. 91.21కు చేరింది.
విశాఖపట్నంలో లీటరు పెట్రోల్ ధర 96.18గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ. 89.91కు చేరింది.
హైదారాబాద్ లో లీటరు పెట్రోల్ ధర 95.13గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ. 89.47కు చేరింది.
దేశంలోని రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పెట్రోల్ ధర ఏకంగా వంద మార్కును ధాటింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more