దేశంలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం కొనసాగుతోంది. కరోనా సెకండ్ వేవ్ లో వివిధ రకాల సైయిన్ లు భారతీయులను పట్టి పీడిస్తున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో కరోనా కేసులు ఏకంగా మూడు లక్షల 66 వేల మార్కును అధిగమించాయి. గత రెండు రోజులుగా ఏకంగా నాలుగు లక్షల ధాటిన కేసులు కాస్త నెమ్మదించాయని కేంద్ర వైద్యఅరోగ్యశాఖ అధికారులకు తెలిపారు. దీంతో దేశంలో మొత్తంగా 2కోట్ల 26 లక్షల మార్కును దాటగా, అదే తరుణంలో కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య కూడా ఏకంగా కోటి 86 లక్షల 71 వేల మార్కును దాటింది. కాగా ఇదే సమయంలో గడిచిన 24 గంటల వ్యవధిలో ఏకంగా 3754లకు పైగా మరణాలు సంభవించాయి.
గత ఏడాది మార్చి నుంచి దేశంలో తన ప్రభావాన్ని ఉద్దృతంగా పెంచుతూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న కరోనా మహమ్మారి.. నవంబర్ నుంచి కాసింత తగ్గుముఖం పడుతూ.. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి సెకెండ్ వేవ్ ఉద్దృతిని కొనసాగిస్తోంది. దీంతో మరోమారు దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ ఒక్కరోజులో ఏకంగా నాలుగు లక్షల సంఖ్యకు పైబడి కరోనా కేసులు నమోదయ్యయి. దీంతో ప్రపంచంలోనే ఒక్క రోజులో అత్యధిక కేసులను నమోదు చేసుకున్న దేశంగా భారత్ మిగిలిపోయింది. ఈ సెకెండ్ వేవ్ కేసులు ఉద్దృతి మరింతగా పెరగడానికి కారణం దేశంలో కరోనా స్టైయిన్ రకాలు అనేకంగా నమోదు కావడమేనని కూడా వైద్యవర్గాలు స్పష్టంచేసిన విషయం తెలిసిందే.
తాజాగా దేశంలో కరోనా బారిన పడిన పది రాష్ట్రాల నుంచి ఏకంగా 73 శాతం కరోనా కేసులు నమోదు అవుతున్నాయని గణంకాలు స్పష్టం చేస్తున్నాయి. వాటిలో మహరాష్ట్ర ముందంజలో వుంది. ఆ తరువాత కర్ణాటక, ఢిల్లీలు కరోనా మహమ్మారి శరవేగంగా విస్తరిస్తున్న రాష్ట్రాలుగా నమోదయ్యాయి, అత్యధికంగా కేసులు కేవలం పది రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ జాబితాలో తొలి మూడు రాష్ట్రాల తరువాత కేరళ, తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాలు నిలిచాయని కేంద్ర వైద్య అరోగ్యశాఖ తెలిపింది.
కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇవాళ ఉదయం విడుదల చేసిన గణంకాల ప్రకారం గడిచిన 24 గంటల వ్యవధిలో 3,53,818 మంది కోలుకున్నారు. దీంతో మొత్తంగా ఇప్పటి వరకు దేశంలో కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 1.86,71.222కు చేరింది. ప్రస్తుతం దేశంలో ఏకంగా 37,45,237 యాక్టివ్ కేసులు వున్నాయి. వివిధ అసుపత్రుల్లో వీరు చికిత్స తీసుకుంటుండగా, వారిలో చాలా మంది హోం క్వారంటైన్ లోనే వున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,26,62,575కు చేరింది. గడచిన 24 గంటల సమయంలో 3,754 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 2,46,116 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,86,71,222 మంది కోలుకున్నారు. దేశవ్యాప్తంగా 17,01,76,603 మందికి వ్యాక్సిన్లు వేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more