India sees over 3.66 lakh new cases దేశంలో 3.66 ల‌క్ష‌లు దాటిన కేసులు.. 24 గంటల్లో 3,754 మరణాలు

India sees 366161 new covid 19 cases 3754 deaths in last 24 hours

Coronavirus cases India, Coronavirus India update, Coronavirus india testing centres, coronavirus vaccine, coronavirus testing india labs, coronavirus deaths india, Coronavirus, Covid-19, Maharashtra, Tamil Nadu, Delhi, Health Ministry, corona fatility, corona cases India

India recorded 3,66,161 fresh Covid-19 cases and 3,754 related deaths. This is for the first time after four straight days that India’s Covid-19 count has risen by less than 4,00,000 fresh infections. The country's daily death toll, too, was more than 4,000 in the last two days.

దేశంలో కోవిడ్ ఉద్దృతి: 3.66 లక్షలు ధాటిన కేసులు.. 24 గంటల్లో 3,754 మరణాలు

Posted: 05/10/2021 03:06 PM IST
India sees 366161 new covid 19 cases 3754 deaths in last 24 hours

దేశంలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం కొనసాగుతోంది. కరోనా సెకండ్ వేవ్ లో వివిధ రకాల సైయిన్ లు భారతీయులను పట్టి పీడిస్తున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో కరోనా కేసులు ఏకంగా మూడు లక్షల 66 వేల మార్కును అధిగమించాయి. గత రెండు రోజులుగా ఏకంగా నాలుగు లక్షల ధాటిన కేసులు కాస్త నెమ్మదించాయని కేంద్ర వైద్యఅరోగ్యశాఖ అధికారులకు తెలిపారు. దీంతో దేశంలో మొత్తంగా 2కోట్ల 26 లక్షల మార్కును దాటగా, అదే తరుణంలో కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య కూడా ఏకంగా కోటి 86 లక్షల 71 వేల మార్కును దాటింది. కాగా ఇదే సమయంలో గడిచిన 24 గంటల వ్యవధిలో ఏకంగా 3754లకు పైగా మరణాలు సంభవించాయి. 

గత ఏడాది మార్చి నుంచి దేశంలో తన ప్రభావాన్ని ఉద్దృతంగా పెంచుతూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న కరోనా మహమ్మారి.. నవంబర్ నుంచి కాసింత తగ్గుముఖం పడుతూ.. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి సెకెండ్ వేవ్ ఉద్దృతిని కొనసాగిస్తోంది. దీంతో మరోమారు దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ ఒక్కరోజులో ఏకంగా నాలుగు లక్షల సంఖ్యకు పైబడి కరోనా కేసులు నమోదయ్యయి. దీంతో ప్రపంచంలోనే ఒక్క రోజులో అత్యధిక కేసులను నమోదు చేసుకున్న దేశంగా భారత్ మిగిలిపోయింది. ఈ సెకెండ్ వేవ్ కేసులు ఉద్దృతి మరింతగా పెరగడానికి కారణం దేశంలో కరోనా స్టైయిన్ రకాలు అనేకంగా నమోదు కావడమేనని కూడా వైద్యవర్గాలు స్పష్టంచేసిన విషయం తెలిసిందే.

తాజాగా దేశంలో కరోనా బారిన పడిన పది రాష్ట్రాల నుంచి ఏకంగా 73 శాతం కరోనా కేసులు నమోదు అవుతున్నాయని గణంకాలు స్పష్టం చేస్తున్నాయి. వాటిలో మహరాష్ట్ర ముందంజలో వుంది.  ఆ తరువాత కర్ణాటక, ఢిల్లీలు కరోనా మహమ్మారి శరవేగంగా విస్తరిస్తున్న రాష్ట్రాలుగా నమోదయ్యాయి, అత్యధికంగా కేసులు కేవలం పది రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ జాబితాలో తొలి మూడు రాష్ట్రాల తరువాత కేరళ, తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాలు నిలిచాయని కేంద్ర వైద్య అరోగ్యశాఖ తెలిపింది.

కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇవాళ ఉదయం విడుదల చేసిన గణంకాల ప్రకారం గడిచిన 24 గంటల వ్యవధిలో 3,53,818 మంది కోలుకున్నారు. దీంతో మొత్తంగా ఇప్పటి వరకు దేశంలో కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 1.86,71.222కు చేరింది. ప్రస్తుతం దేశంలో ఏకంగా 37,45,237 యాక్టివ్ కేసులు వున్నాయి. వివిధ అసుపత్రుల్లో వీరు చికిత్స తీసుకుంటుండగా, వారిలో చాలా మంది హోం క్వారంటైన్ లోనే వున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య‌ 2,26,62,575కు చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 3,754 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 2,46,116 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,86,71,222 మంది కోలుకున్నారు. దేశవ్యాప్తంగా 17,01,76,603 మందికి వ్యాక్సిన్లు వేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Coronavirus  Covid-19  Maharashtra  Tamil Nadu  Delhi  Health Ministry  corona fatility  corona cases India  

Other Articles