అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరిగుతున్న నేపథ్యంలో దేశీయంగా పెట్రో ధరల పెంపు అనివార్యం అవుతోందని పెట్రో సంస్థలు చెబుతున్న లెక్కలు ఏ మేరకు వాస్తవాలో వాహనదారులకు తెలిసిన విషయమే. ఈ క్రమంలో వరుసగా పన్నెండవ రోజు ఇంధన ధరలు పెరిగాయి. దేశరాజధాని ఢిల్లీలో రికార్డు స్థాయిలో పెట్రోల్ ధర రూ. 90.58కు చేరింది. అంతర్జాతీయంగా బ్యారెల్ క్రూడ్ అయిల్ ధర పెరగడంతో ఇంధన ధరలకు పెట్రో సంస్థలు పెంచాయి. క్రూడ్ అయిల్ ధర ఒక్క డాలర్ పెరగిన నేపథ్యంలో భారత ఇంధన సంస్థలపై సాలినా రూ.10700 కోట్ల భారం పడుతోంది. ఇక దీనికి తోడు ప్రస్తుతం మధ్యపాశ్చ దేశాలలో నెలకొన్న ఆందోళనలు కూడా ఈ ధరల పెంపుకు కారణం అవుతున్నాయి.
వరుసగా పన్నెండవ రోజ పెరిగిన ఇంధన ధరల పెంపు వాహనదారులను అందోళనకు గురిచేస్తున్నాయి. ఇవాళ పెట్రోల్ పై రూ.0.39 డీజిల్ పై రూ.0.37 పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశ రాజధానిలోనే మునుపెన్నడూ లేని గరిష్ట రికార్డు స్థాయికి పెట్రోల్ ధర చేరుకుంది. దేశంలో మునుపెన్నడే లేని విధంగా పెట్రో ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర విధించిన పన్నులను కాసింత మినహాయించాలని వాహనదారుల నుంచి వినతతులు వ్యక్తమవుతున్నాయి. కాగా పెట్రోల్, డీజిల్ పై కేంద్రం విధిస్తున్న ఎక్సైజ్ సుంకం, పన్నులను తగ్గించే ఆలోచన లేదని కేంద్ర పెట్రోలియంశాఖ స్పష్టం చేసింది.
తాజా పెంపుతో ఇంధన ధరలు సెంచరీ మార్కును అందుకునేందుకు పరుగులు పెడుతుండటం.. వాటి ప్రభావం నేరుగా వాహనదారులపై.. పరోక్షంగా నిత్యావసర సరుకులపై పడటంతో యావత్ దేశప్రజలు తీవ్ర అందోళనకు గురవుతున్నారు. మరీ ముఖ్యంగా కూరగాయాలు, ఆహారాధన్యాల ధరలు ఆకాశానంటుతున్నాయి. హైదరాబాద్ లో ఇంధన ధరలు ఏకంగా మునుపెన్నడూ లేని గరిష్ట స్థాయిని అందుకున్నాయి. సాధారణ పెట్రోల్ ధర లీటరు రూ.94 దాటి పరుగులు పెడుతోంది. ఇక బ్రాండెడ్ పెట్రోల్ ధర తొంభై ఏడు రూపాయలను అందుకుని ముందుకు దూసుకెళ్తోంది.
తాజాగా పెరిగిన ధరలతో న్యూఢిల్లీలో లీటరు పెట్రోలు 90.58, డీజిల్ రూ.80.97
కోల్ కతాలో లీటరు పెట్రోల్ రూ.91.78, డీజిల్ రూ. 84.56
ముంబైలో లీటరు పెట్రోల్ రూ. 97.00 కు, డీజిల్ రూ. 88.06
చెన్నైలో లీటరు పెట్రోల్ రూ. 92.59, డీజిల్ రూ. 85.98
బెంగళూరులో లీటరు పెట్రోల్ రూ. 93.61, డీజిల్ రూ. 85.84
హైదరాబాదులో లీటరు పెట్రోలు రూ. 94.18, డీజిల్ రూ. 88.31
విశాఖపట్నంలో లీటరు పెట్రోలు రూ.95.52 డీజిల్ రూ. రూ.88.76
అమరావతిలో లీటరు పెట్రోల్ రూ. 96.73, డీజిల్ రూ. 90.33కు చేరింది.
(And get your daily news straight to your inbox)
Mar 06 | టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణ మరోసారి తన దురుసు ప్రవర్తనతో వార్తల్లో నిలిచారు. ఎన్నికల ప్రచారం ఎప్పుడు చేపట్టినా ఆయన తన చేతివాటాన్ని ప్రదర్శించడం పరిపాటిగా మారుతోందన్న విమర్శలకు మరోమారు... Read more
Mar 06 | ఉత్తమ సర్పంచ్గా అవార్డు తీసుకున్న వ్యక్తి రూ. 13 లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో జరిగిందీ ఘటన. ఏసీబీ కథనం ప్రకారం.. జిల్లాలోని పూడూరు మండలం మన్నెగూడ... Read more
Mar 06 | సొంత పార్టీ తీసుకునే నిర్ణయాలను కూడా విమర్శించే బీజేపీనేత సుబ్రహ్మణ్యస్వామి ఇటీవల పెరుగుతున్న ఇంధన ధరలపై తనదైన శైలిలో విసిరిన పంచ్ బీజేపి ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలో పడేసింది. ఒక విధంగా వరుసగా ఆరు రోజుల... Read more
Mar 06 | ఝార్ఖండ్లో దారుణం ఘటన జరిగింది. ఓ యువతిని బంధించిన 60 మంది దుండగులు నెలరోజులగా ఆమెపై అఘాయిత్యానికి తెగబడ్డారు. మాదకద్రవ్యాలను ఇంజెక్షన్ రూపంలో ఇస్తూ తనపై నిత్యం అఘాయిత్యానికి పాల్పడ్డారని బాధితురాలు పోలీసులకు తెలిపింది.... Read more
Mar 06 | యావత్ ప్రపంచ దేశాల అర్థిక పరిస్థితులను కోవిడ్ మహమ్మారి అతలాకుతలం చేసిన నేపథ్యంలో దాని నుంచి బయటపడేందుకు గత ఏడాది జూన్ లో ఏర్పడిన అన్ లాక్ నుంచి ప్రతీ అంశంలో ధరాఘాతాన్ని ప్రజలు... Read more