అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరిగుతున్న నేపథ్యంలో దేశీయంగా పెట్రో ధరల పెంపు అనివార్యం అవుతోందని పెట్రో సంస్థలు చెబుతున్న లెక్కలు ఏ మేరకు వాస్తవాలో వాహనదారులకు తెలిసిన విషయమే. ఈ క్రమంలో వరుసగా పన్నెండవ రోజు ఇంధన ధరలు పెరిగాయి. దేశరాజధాని ఢిల్లీలో రికార్డు స్థాయిలో పెట్రోల్ ధర రూ. 90.58కు చేరింది. అంతర్జాతీయంగా బ్యారెల్ క్రూడ్ అయిల్ ధర పెరగడంతో ఇంధన ధరలకు పెట్రో సంస్థలు పెంచాయి. క్రూడ్ అయిల్ ధర ఒక్క డాలర్ పెరగిన నేపథ్యంలో భారత ఇంధన సంస్థలపై సాలినా రూ.10700 కోట్ల భారం పడుతోంది. ఇక దీనికి తోడు ప్రస్తుతం మధ్యపాశ్చ దేశాలలో నెలకొన్న ఆందోళనలు కూడా ఈ ధరల పెంపుకు కారణం అవుతున్నాయి.
వరుసగా పన్నెండవ రోజ పెరిగిన ఇంధన ధరల పెంపు వాహనదారులను అందోళనకు గురిచేస్తున్నాయి. ఇవాళ పెట్రోల్ పై రూ.0.39 డీజిల్ పై రూ.0.37 పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశ రాజధానిలోనే మునుపెన్నడూ లేని గరిష్ట రికార్డు స్థాయికి పెట్రోల్ ధర చేరుకుంది. దేశంలో మునుపెన్నడే లేని విధంగా పెట్రో ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర విధించిన పన్నులను కాసింత మినహాయించాలని వాహనదారుల నుంచి వినతతులు వ్యక్తమవుతున్నాయి. కాగా పెట్రోల్, డీజిల్ పై కేంద్రం విధిస్తున్న ఎక్సైజ్ సుంకం, పన్నులను తగ్గించే ఆలోచన లేదని కేంద్ర పెట్రోలియంశాఖ స్పష్టం చేసింది.
తాజా పెంపుతో ఇంధన ధరలు సెంచరీ మార్కును అందుకునేందుకు పరుగులు పెడుతుండటం.. వాటి ప్రభావం నేరుగా వాహనదారులపై.. పరోక్షంగా నిత్యావసర సరుకులపై పడటంతో యావత్ దేశప్రజలు తీవ్ర అందోళనకు గురవుతున్నారు. మరీ ముఖ్యంగా కూరగాయాలు, ఆహారాధన్యాల ధరలు ఆకాశానంటుతున్నాయి. హైదరాబాద్ లో ఇంధన ధరలు ఏకంగా మునుపెన్నడూ లేని గరిష్ట స్థాయిని అందుకున్నాయి. సాధారణ పెట్రోల్ ధర లీటరు రూ.94 దాటి పరుగులు పెడుతోంది. ఇక బ్రాండెడ్ పెట్రోల్ ధర తొంభై ఏడు రూపాయలను అందుకుని ముందుకు దూసుకెళ్తోంది.
తాజాగా పెరిగిన ధరలతో న్యూఢిల్లీలో లీటరు పెట్రోలు 90.58, డీజిల్ రూ.80.97
కోల్ కతాలో లీటరు పెట్రోల్ రూ.91.78, డీజిల్ రూ. 84.56
ముంబైలో లీటరు పెట్రోల్ రూ. 97.00 కు, డీజిల్ రూ. 88.06
చెన్నైలో లీటరు పెట్రోల్ రూ. 92.59, డీజిల్ రూ. 85.98
బెంగళూరులో లీటరు పెట్రోల్ రూ. 93.61, డీజిల్ రూ. 85.84
హైదరాబాదులో లీటరు పెట్రోలు రూ. 94.18, డీజిల్ రూ. 88.31
విశాఖపట్నంలో లీటరు పెట్రోలు రూ.95.52 డీజిల్ రూ. రూ.88.76
అమరావతిలో లీటరు పెట్రోల్ రూ. 96.73, డీజిల్ రూ. 90.33కు చేరింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more