ఇద్దరు మైనర్ విద్యార్థులు తరగతి గదినే వివాహ వేదికగా చేసుకున్నారు. బంధవులు, మేళతాళాలు, మంగళవాయిద్యాలు ఏమీ లేకుండా తన సహచర విద్యార్థిని మెడలో (మంగళసూత్రం) పసుపుతాడు కట్టాడు ఓ విద్యార్థి. అయితే ఇక్కడ తాళి కట్టిన విద్యార్థి.. తాళిని కట్టించుకున్న విద్యార్థిని ఇద్దరూ మైనర్లు కావడం గమనార్హం. వీరిద్దరూ చదువుతున్నది ఇంటర్ ద్వితీయ సంవత్సరం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో సంచలనం రేపింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వీడియోతో అంతకు పది రోజుల ముందుగానే ఈ ఘటన చోటుచేసుకుందని తేలింది. దీనిపై స్పందించిన కాలేజీ యాజమాన్యం విద్యార్థి, విద్యార్థినితో పాటుగా సహకరించిన మరో విద్యార్థినిని కూడా సస్పెండ్ చేసింది.
సినిమాలు, సీరియళ్ల ప్రభావం.. ఇక తాజాగా అందుబాటులోకి వచ్చిన పలు సామాజిక మాద్యమాలో హీరో కావడానికి చేసే వీడియోలు.. తెలిసితెలియని అమాయకత్వ యువతపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయో ఈ ఘటనే ఉదాహరణ. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో జరిగిన ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి సమాచారం అందుకున్న కాలేజీ యాజమాన్యం వారిని విచారించింది. దీంతో టిక్ టాక్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ ఫ్లామ్ పై పోస్టు చేసేందుకు ఈ వీడియో తీశారని, అంతేకానీ ఈ వీడియో నిజమైన వివాహమో లేక ప్రేమ వివాహమో కాదని వారిద్దరూ అంగీకరించారని యాజమాన్యం తెలిపింది. కేవలం సోషల్ మీడియాలో లైకుల కోసం చేసిన తూతూమంత్రపు పెళ్లని వారు తెలిపారు. అందుకోసమే వీడియోను కూడా తీశారని యాజమాన్యం వారి తల్లిదండ్రులకు వివరించింది.
అయితే బాలిక మెడలో తాళి కట్టిన విద్యార్థి, ఆపై ఆమెకు బొట్టు పెడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో స్పందించిన కాలేజీ ప్రిన్సిపాల్, ఇలాంటి చర్యలను మున్ముందు ఏ విద్యార్థి చేయకుండా చర్యలకు ఉపక్రమించింది. వీరిద్దరినీ కాలేజీ నుంచి సస్పెండ్ చేసింది. వీరితో పాటు ఉన్న మరో విద్యార్థిని కూడా వీరికి వీడియో తీసేందుకు సహకరించిన కారణంగా అమెను కూడా సస్పెండ్ చేసింది. అయితే సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించడం కోసం కట్టుబాట్లు, సంస్కృతులు తెలియకుండా.. పవిత్ర కార్యాలను కూడా పిల్లలాటలా మార్చడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాను సమాజ శ్రేయస్సు కోసం వినియోగించాలని ప్రభుత్వాలు చట్టలాను తీసుకురావాలని కూడా డిమాండ్లు పెరుగుతున్నాయి.
(Video Source: ABN Telugu)
(And get your daily news straight to your inbox)
Jan 19 | ఆంధ్రప్రదేశ్ లో గ్రామస్థాయిలో ఎన్నికల నిర్వహణ పంచాయితీ హైకోర్టుకు చేరిన తరుణంలో ఎన్నికల నిర్వహణ వుంటుందా.? లేదా అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఫిబ్రవరిలో నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ఎన్నికల... Read more
Jan 19 | అనునిత్యం దేశం కోసం.. దేశభక్తి కోసం ప్రసంగాలు గుప్పించే వ్యక్తుల నుంచి దేశానికి సంబంధించిన అత్యంత గోప్యమైన సమాచారం ఓ జర్నలిస్టుకు లీక్ కావడంపై కాంగ్రెస్ మాజీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రంగా... Read more
Jan 19 | హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ లిమిటెడ్ సంస్థ రూపోందించిన కరోనా వాక్సీన్ కోవాక్సీన్ ను మూడవ దశ ట్రయల్స్ పూర్తి కాకుండానే అత్యవసర వినియోగం కోసం లైసెన్స్ పొందిన విషయం తెలిసిందే. అయితే... Read more
Jan 19 | నాగార్జునసాగర్ ఉప ఎన్నికను అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఉప ఎన్నికలలో భారీ మెజారిటీని సాధించేందుకు పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది. రాష్ట్రంలో తమకు ఎదురులేదని.. మోనార్క్ ముద్రను వేసుకున్న టీఆర్ఎస్ ఇకపై ఎన్నికలంటే... Read more
Jan 19 | కరోనా మహమ్మారి ప్రపంచ మానవాళిని భయం గుప్పెట్లోకి నెట్టిన తరువాత రెండో వేవ్ అంటూ భయాలు ఉత్పన్నమైన వేళ.. సెకెండ్ స్ట్రెయిన్ కూడా పలు దేశాలను అతలాకుతలం చేసింది. కరోనా నుంచి కోలుకున్న తరువాత... Read more