(Image source from: Thehansindia.com)
తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వరకు చాటిన మహానుభావుడు మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ అని, ప్రపంచంలోని తెలుగువారందరినీ ఏకం చేసిన ఘనత ఆయనదని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కొనియాడారు. ఇక తెలుగువారికి మరింత వన్నె తీసుకువచ్చిన మహనీయుడు, తన ఆర్థిక సంస్కరణలతో ఈ దేశాన్ని అర్థిక సంక్షోభంలో పడనీయకుండా కాపాడిన ఘనుడు మాజీ ప్రధానమంత్రి సీపీ నరసింహారావుదని ప్రశంసించారు. దేశ ఆర్థిక వ్యవస్థను ఒడిదొడుకులు చుట్టుముట్టినా చెక్కుచెదరని అత్యున్నతమైన స్థితికి చేర్చిన ఘనత ఆయనదని అన్నారు. ప్రపంచ దేశాలతో భారత్ పోటీ పడేలా తీర్చిదిద్దారని అన్నారు.
ఇలా దేశానికి, రాష్ట్రానికే వన్నె తెచ్చిన మహనీయుల పేర్లను ఓట్ల కోసం వినియోగించుకుని దిగజారుడు రాజకీయాలకు పాల్పడటంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు, ఈ మహనీయులకు పేర్లను తుచ్చ రాజకీయాల కోసం వినియోగించడం చౌకబారు రాజకీయాలకు ఆజ్యం పోయడమేనని అన్నారు. ఎంఐఎం నేతలు ఎన్టీఆర్, పీవీ ఘాట్ గురించి వ్యాఖ్యలు చేయడం.. దానిని రాజకీయ మైలేజీకి బీజేపి వినియోగించుకునేందుకు యత్నించడం కూడా దారుణమనే అన్నారు. ఈ మహనీయుల పేర్లను నిజంగా ఉచ్చరించాలంటే.. వారికి భారత దేశ అత్యున్నత పురస్కారాలైన భారత రత్న అవార్డులను అందజేసే క్రమంలోనే తప్ప.. ఓట్ల కోసం, సీట్ల కోసం మాత్రం కారాదని రేవంత్ సూచించారు.
బీజేపిలోని అగ్రనేతలైన ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, కళ్యాణ్ సింగ్ లాంటి మహనీయులను పక్కనబెట్టిన బీజేపి ఇతర పార్టీలకు చెందిన నాయకులను ప్రశంసిస్తూ.. రాజకీయ మైలేజీకి పాకులాడుతుందని దుయ్యబట్టారు, ఎన్టీఆర్, పీవీలపై ఎంతో గౌరవం ఉందని బీజేపీ చెపుతోందని... నిజంగా మీకు వారిపై గౌరవమే ఉంటే... కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి వారికి భారతరత్న ఇవ్వాలని రేవంత్ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ పీవీ, ఎన్టీఆర్ ఘాట్లను సందర్శించి, వారిద్దరికీ భారతరత్నను ప్రకటించాలని డిమాండ్ చేశారు. పార్లమెంటు సమావేశంలో చర్చ పెట్టి, ఈ ఇద్దరు మహానాయకులకు మేము భారతరత్న ఇస్తున్నామని ప్రకటించాలని కోరారు.
(And get your daily news straight to your inbox)
Apr 03 | ఉత్తరప్రదేశ్ లో జరగనున్న పంచాయతీ ఎన్నికలు ఈసారి గ్లామరెస్ గా మారనున్నాయి. తాను పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఫెమినా మిస్ ఇండియా -2015 రన్నరప్ దీక్షాసింగ్ ప్రకటించింది. జౌన్ పూర్ జిల్లా బక్షా... Read more
Apr 03 | ఎనబై ఏళ్లకు పైబడిన వయస్సులోనూ అమె తన జీవనం కోసం అలోచించకుండా పది మంది కడుపు నింపే పనికి పూనుకున్నారు. అందరూ తన బిడ్డల లాంటి వారేనని, అమె అందరికీ అందుబాటు ధరలోనే ఇడ్లీలు... Read more
Apr 03 | బెంగళూరు డ్రగ్స్ కేసు..శాండిల్ వుడ్ పరిశ్రమను షేక్ చేసి అక్కడి ప్రముఖులను ఊచలు లెక్కపెట్టించిన కేసుకు సంబంధించిన లింకులు తెలంగాణలోనూ బయటపడ్డాయి. ఆ మధ్య పలువురు నటుల చు్ట్టూ తిరిగిన ఈ కేసులో వారి... Read more
Apr 03 | అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న అసోంలో బీజేపీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. అసోం బీజేపి ప్రతినిధిగా ముఖ్యమంత్రి సోనూవాల్ ను అధిగమించి మరీ దూసుకుపోతున్న రాష్ట్ర మంత్రి హిమంత విశ్వశర్మపై చర్యలు తీసుకున్నఎన్నికల కమీషన్... Read more
Apr 03 | తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అంకానికి మరికొన్ని గంటల వ్యవధిలో తెరపడుతుందన్న తరుణంలో రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు, అరోపణలు ఊపందుకుంటున్నాయి. మరీముఖ్యంగా బీజేపిని టార్గెట్ చేస్తున్న ప్రతిపక్ష పార్టీ డీఎంకే అధినేత... Read more