ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలక పరిణామానికి రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఆమోదముద్ర వేయడంతోనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నోటిపై చేసింది. మూడు రాజధానుల పరిపాలన వికేంద్రీకరణ బిల్లుతో పాటు సీఆర్డీఏ రద్దు బిల్లులపై గెజిట్ విడుదల చేసింది. అన్ని ప్రాంతాల సమీకృత అభివృద్ధి చట్టం-2020గా పేర్కొంటూ రెండు చట్టాలకు సంబంధించి వేర్వేరు గెజిట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ బిల్లుపై అధికార వర్గం స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో విపక్షం మాత్రం బిల్లును సంపూర్ణంగా వ్యతిరేకిస్తున్నామని తేల్చిచెప్పింది. గవర్నర్ హరిచందన్ నిర్ణయం తీసుకున్న ఈ రోజు రాష్ట్ర చరిత్రంలో చీకటి రోజుగా అభివర్ణించింది.
ఏపీ పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై గవర్నర్ తీసుకున్న నిర్ణయం చారిత్రక తప్పిదమని, రాజ్యాంగ విరుద్ధమని టీడీపీ అధినేత చంద్రబాబు అభిప్రాయపడ్డారు. కరోనా వ్యాప్తి నానాటికీ పెరుగుతున్న వేళ.. ప్రజారోగ్యంపై ప్రభుత్వవర్గాలతో చర్చించి క్షేత్రస్థాయిలో పరిస్థితినిపై పర్యవేక్షించాల్సిన గవర్నర్.. దానిని పక్కనబెట్టి.. ఈ తరుణంలో మూడు రాజధానుల బిల్లుతో పాటు సీఆర్ఢీఏ రద్దు బిల్లులను అమోధించడం ఏంటని ఆయన ప్రశ్నించారు. క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్రంలో చిచ్చురేపే నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు. ప్రజలు తమ వ్యతిరేకతను కూడా చాటుకునే పరిస్థితులు కూడా లేకుండా చేసి ఇలాంటి నిర్ణయాన్ని ప్రకటిస్తారా.? అని నిలదీశారు.
అమరావతిలో రాజధాని అనగానే.. ఆ పరిసర ప్రాంతాల్లోని 29 వేల మంది రైతులు తమ భూములు త్యాగం చేశారని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వంపై నమ్మకంతో రైతులు ఆ భూములు ఇచ్చారని పేర్కోన్నారు. ప్రభుత్వం మారగానే తమ భూములు కూడా నిష్ప్రయోజనంగా మారుతాయని, రాజధాని తరలివెళ్లిపోతోందని వారికి తెలియదని అన్నారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకుని రాష్ట్ర ప్రజల స్వప్నాన్ని వైసీపీ ప్రభుత్వం నీరుగార్చించిందని దుయ్యబట్టారు. ఈ బిల్లుల అమోదందో పార్లమెంట్ వ్యవస్థపైనా, శాసన వ్యవస్థపైనా ప్రజలకు సన్నగిల్లేలా చేశారని ఆయన ధ్వజమెత్తారు. పార్లమెంటు అమోదం పోందిన పునర్విభజన చట్టానికి కూడా వైసీపీ చిల్లులు పొడిచిందని మండిపడ్డారు. రాజధాని బిల్లుకు అప్పట్లో మద్దతిచ్చిన జగన్.. ఇప్పుడు ఎందుకు మడమ తిప్పారని, మాట తప్పారని ఆయన ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రజలకు కావాల్సింది అభివృద్ధి వికేంద్రీకరణ, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు. కానీ మూడు రాజధానుల పేరుతో అందరినీ అయోమయానికి గురిచేయడం కాదని అన్నారు. ప్రభుత్వ చర్య రాష్ట్ర అభివృద్ధికి విఘాతమని విమర్శించారు. మూడు రాజధానులపై ప్రజాభిప్రాయం కోరుతూ ఎన్నికలకు వెళ్లాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. రాజధానిగా అమరావతి ప్రకటన సమయంలోనే తాము జిల్లాల అభివృద్ధి ప్రణాళిక ప్రకటించామన్నారు. రాయలసీమను పారిశ్రామిక హబ్ గా చేసి పలు ప్రాజెక్టులను తీసుకువచ్చామని, మరెన్నో రావాల్సివుండగా, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దుర్మార్గంగా వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ నిర్ణయంపై న్యాయ పోరాటం చేస్తామని చంద్రబాబు అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more