Establishment of 3 capitals is historical blunder: Naidu గవర్నర్ అమోదం.. చీకటి రోజుకు తార్కాణం: చంద్రబాబు

Dark day in andhras history chandrababu naidu reacts to governors nod to 3 capital bills

amaravati, Historical blunder, dark day, BB Harichandan, Andhra Pradesh, andhra pradesh 3-capital plan, Andhra Pradesh Reorganisation Act, andhra pradesh reorganisation bill, andhra pradesh, Chandrababu Naidu, Jagan Mohan Reddy, Biswa Bhusan Harichandan, andhra pradesh governor, A.P. Capital Region Development Authority Repeal Bills, A.P. governor, A.P. CRDA Repeal Bills, Governor approves three capitals, CM Jagan, Andhra Pradesh, politics

Former Andhra Pradesh Chief Minister and Telugu Desam Party (TDP) President Chandra Babu Naidu on Friday said the governor's decision on decentralisation of the state Pradesh administration and the cancellation of Capital Region Development Authority (CRDA) Bill is a historical mistake.

గెజిట్ జారీ చేసిన ప్రభుత్వం.. న్యాయపోరాటం చేస్తామన్న విపక్షం

Posted: 08/01/2020 01:08 AM IST
Dark day in andhras history chandrababu naidu reacts to governors nod to 3 capital bills

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలక పరిణామానికి రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఆమోదముద్ర వేయడంతోనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నోటిపై చేసింది. మూడు రాజధానుల పరిపాలన వికేంద్రీకరణ బిల్లుతో పాటు సీఆర్డీఏ రద్దు బిల్లులపై గెజిట్ విడుదల చేసింది. అన్ని ప్రాంతాల సమీకృత అభివృద్ధి చట్టం-2020గా పేర్కొంటూ రెండు చట్టాలకు సంబంధించి వేర్వేరు గెజిట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ బిల్లుపై అధికార వర్గం స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో విపక్షం మాత్రం బిల్లును సంపూర్ణంగా వ్యతిరేకిస్తున్నామని తేల్చిచెప్పింది. గవర్నర్ హరిచందన్ నిర్ణయం తీసుకున్న ఈ రోజు రాష్ట్ర చరిత్రంలో చీకటి రోజుగా అభివర్ణించింది.

ఏపీ పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై గవర్నర్ తీసుకున్న‌ నిర్ణయం చారిత్రక తప్పిదమని, రాజ్యాంగ విరుద్ధమని టీడీపీ అధినేత చంద్రబాబు అభిప్రాయపడ్డారు. కరోనా వ్యాప్తి నానాటికీ పెరుగుతున్న వేళ.. ప్రజారోగ్యంపై ప్రభుత్వవర్గాలతో చర్చించి క్షేత్రస్థాయిలో పరిస్థితినిపై పర్యవేక్షించాల్సిన గవర్నర్.. దానిని పక్కనబెట్టి.. ఈ తరుణంలో మూడు రాజధానుల బిల్లుతో పాటు సీఆర్ఢీఏ రద్దు బిల్లులను అమోధించడం ఏంటని ఆయన ప్రశ్నించారు. క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్రంలో చిచ్చురేపే నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు. ప్రజలు తమ వ్యతిరేకతను కూడా చాటుకునే పరిస్థితులు కూడా లేకుండా చేసి ఇలాంటి నిర్ణయాన్ని ప్రకటిస్తారా.? అని నిలదీశారు.

అమరావతిలో రాజధాని అనగానే.. ఆ పరిసర ప్రాంతాల్లోని 29 వేల మంది రైతులు తమ భూములు త్యాగం చేశారని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వంపై నమ్మకంతో రైతులు ఆ భూములు ఇచ్చారని పేర్కోన్నారు. ప్రభుత్వం మారగానే తమ భూములు కూడా నిష్ప్రయోజనంగా మారుతాయని, రాజధాని తరలివెళ్లిపోతోందని వారికి తెలియదని అన్నారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకుని రాష్ట్ర ప్రజల స్వప్నాన్ని వైసీపీ ప్రభుత్వం నీరుగార్చించిందని దుయ్యబట్టారు. ఈ బిల్లుల అమోదందో పార్లమెంట్ వ్యవస్థపైనా, శాసన వ్యవస్థపైనా ప్రజలకు సన్నగిల్లేలా చేశారని ఆయన ధ్వజమెత్తారు. పార్లమెంటు అమోదం పోందిన పునర్విభజన చట్టానికి కూడా వైసీపీ చిల్లులు పొడిచిందని మండిపడ్డారు. రాజధాని బిల్లుకు అప్పట్లో మద్దతిచ్చిన జగన్‌.. ఇప్పుడు ఎందుకు మడమ తిప్పారని, మాట తప్పారని ఆయన ప్రశ్నించారు.

రాష్ట్ర ప్రజలకు కావాల్సింది అభివృద్ధి వికేంద్రీకరణ, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు. కానీ మూడు రాజధానుల పేరుతో అందరినీ అయోమయానికి గురిచేయడం కాదని అన్నారు. ప్రభుత్వ చర్య రాష్ట్ర అభివృద్ధికి విఘాతమని విమర్శించారు. మూడు రాజధానులపై ప్రజాభిప్రాయం కోరుతూ ఎన్నికలకు వెళ్లాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. రాజధానిగా అమరావతి ప్రకటన సమయంలోనే తాము జిల్లాల అభివృద్ధి ప్రణాళిక ప్రకటించామన్నారు. రాయలసీమను పారిశ్రామిక హబ్ గా చేసి పలు ప్రాజెక్టులను తీసుకువచ్చామని, మరెన్నో రావాల్సివుండగా, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దుర్మార్గంగా వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్‌ నిర్ణయంపై న్యాయ పోరాటం చేస్తామని చంద్రబాబు అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles