ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఇవాళ కీలక పరిణామానికి తెరలేపడంతో రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయ పార్టీలో అలర్ట్ అయ్యాయి. మూడు రాజధానుల బిల్లుతో పాటు సీఆర్డీఏ రద్దు బిల్లులపై గవర్నర్ ఆమోదముద్ర వేయడంతో పార్టీలో తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయి, ఇప్పటికే ఈ మేరకు నిర్ణయం తీసుకున్న ఈ రోజు రాష్ట్ర చరిత్రలోనే చీకటి రోజుగా టీడీపీ అధినేత చంద్రబాబు అభివర్ణించారు. ఈ నిర్ణయం చారిత్రక తప్పిదమని, రాజ్యాంగ విరుద్ధమని దుయ్యబట్టారు. ఆయనతో పాటు అమరావతి జేఏసీ కూడా ఇదే తరహాలో అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. గవర్నర్ నిర్ణయంపై న్యాయపోరాటం కూడా చేస్తామని ప్రకటించింది.
ఇదే సమయంలో గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ తీసుకున్న నిర్ణయంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ఇలాంటి కీలక అంశాలపై ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయలేని, నిరసనలు తెలుపలేని సంకటకర పరిస్థితుల్లో గవర్నర్ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై నిర్ణయం తీసుకునేందుకు చాలా సమయంలో ఉందని, అయితే రాష్ట్రంలో కరోనా మహమ్మారి కలకలం రేపుతూ తన ఉద్దృతిని అంతకంతకూ విస్తరించుకుంటూ వ్యాప్తిని చెందుతున్న తరుణంలో ఇలాంటి కీలక బిల్లులపై నిర్ణయాలు తీసుకోవడం సముచిత సమయం కాదని అభిప్రాయపడ్డారు.
మూడు రాజధానులపై నిర్ణయానికి ఇది సరైన సమయం కాదని అన్నారు. రాష్ట్రంలో రోజుకు పదివేల కొవిడ్ కేసులు నమోదు అవుతున్నాయని, దీంతో ప్రజలు ప్రాణాలు అరచేత పట్టుకుని భయాందోళనతో బతుకుతున్నారని చెప్పారు. ఈ పరిస్థితుల్లో పాలన వికేంద్రీకరణపై కాకుండా ప్రజలను రక్షించడానికి రాష్ట్ర మంత్రివర్గం, ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. అలానే పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలిపన నేపథ్యంలో రాజధాని రైతుల పరిస్థితిపై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీలో చర్చించి భవిష్యత్ ప్రణాళిక రూపొందిస్తామని పవన్ తెలిపారు. రైతుల కోసం జనసేన తుది వరకు పోరాడుతుందని హామీ ఇచ్చారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more