(Image source from: in.reuters.com)
కరోనా వైరస్ సంక్షోభం నేపథ్యంలో జనం అంతా మాస్క్లు ధరిస్తున్నారు. అయితే ఎన్95 మాస్క్ లు ధరిస్తున్న వారికి కేంద్రం హెచ్చరిక జారీ చేసింది. గాలి పీల్చే వాల్వ్ లు ఉన్న ఎన్95 మాస్క్లు హానికరమని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇలాంటి మాస్కులు.. వైరస్ వ్యాప్తిని నియంత్రించలేవని ఆరోగ్యశాఖకు చెందిన డైరక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీస్స్ పేర్కొన్నది. ఈ మేరకు ఆయన కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రికి ఓ లేఖ రాశారు. దీంతో ఆయన లేఖను పరిగణలోకి తీసుకున్న కేంద్రం ఈ మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ఆరోగ్యశాఖ కార్యదర్శులకు, కేంద్రపాలిత ప్రాంతాలకు, వైద్య విద్యా సంస్థలకు.. కేంద్ర ఆరోగ్యశాఖ ఓ సర్య్యూలర్ జారీ చేసింది.
దేశవ్యాప్తంగా తప్పుడు పద్ధతిలో ఎన్95 మాస్క్ లను ధరిస్తున్నట్లు ఆరోగ్య శాఖ ఆరోపించింది. హెల్త్ వర్కర్లు కాకుండా ఇతర ప్రజలు గాలి పీల్చే వాల్వ్ ఉన్న ఎన్95 మాస్కులు వాడుతున్నట్లు తెలియజేసింది. అయితే సాధారణ ప్రజలు ఇంట్లో తయారు చేసిన ముఖం మాస్కులను మాత్రమే వాడాలని డీజీహెచ్ఎస్ తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. డీజీహెచ్ఎస్ అధిపతి రాజివ్ గార్గ్ ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాశారు. అయితే మాస్క్ రంగుతో వైరస్ నియంత్రణకు ఎటువంటి సంబంధం లేదని ఆరోగ్యశాఖ చెప్పింది. కానీ ప్రతి రోజు సాధారణ మాస్కులను 5 నిమిషాల పాటు వేడి నీటిలో ఉతకాలని సూచించింది. ఉతికేటప్పుడు ఉప్పు వేస్తే మంచిదని పేర్కొన్నది.
‘‘వాల్వ్ కలిగిన ఎన్ 95 ముసుగులు (మాస్కు) వాడడం సురక్షితం కాదని మీ దృష్టికి తీసుకువస్తున్నాను.. వాల్వ్ వున్న మాస్కుల వాడకం హానికరమని.. ఇది కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడానికి తీసుకున్న చర్యలకు భంగం కలిగిస్తోంది. దీంతో కరోనావైరస్ నుంచి రక్షణ పోందే వాల్వ్ రహిత మాస్కులను ప్రజలు వినియోగించేలా చర్యలు తీసుకోవాలి. ఇంట్లో తయారు చేసిన కాటన్ మాస్కులే మరింత సురక్షితమని, వీటినే ప్రజలందరూ వాడేలా చూడాలని కోరుతున్నారు. ఈ విషయాన్ని సంబంధిత అధికారులందరికీ సూచించాల్సిందిగా కోరుతున్నాను’’ అని ఆయన కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శికి రాసిన లేఖలో పేర్కోన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more