విపత్తులు, అత్యయిక పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పెన్షనర్ల పింఛన్లలో కోత విధించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్సుకు ఆమోదముద్ర లభించింది. దీంతో తెలంగాణ విపత్తులు, ప్రజారోగ్య అత్యయిక ఆర్డినెన్స్ 2020కి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసింది. మార్చి 24 నుంచి ఇది అమల్లోకి వచ్చినట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా ఆరు నెలల పాటు ఈ అర్డినెన్స్ అమల్లో వుండనుంది. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఉద్యోగాల వేతనాల్లో కోత విధించిన క్రమంలో ఈ ఆర్డీనెన్సును ప్రభుత్వం తీసుకువచ్చింది.
ఈ ఆర్డినెన్సు సారాంశం.. “ఏ ఇతర చట్టం, నియమం లేదా ఉత్తర్వు లేదా కోడ్ లేదా తీర్పు లేదా ఏ కోర్టు లేదా ట్రిబ్యునల్ యొక్క ఉత్తర్వులలో ఏదైనా ఉన్నప్పటికీ, విపత్తు లేదా ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి లేదా ఇతర పరిస్థితుల నుండి తలెత్తే పరిస్థితుల నిర్వహణ కోసం ప్రభుత్వ ఉద్యోగలు, పెన్షన్లు చెల్లించాల్సిన మొత్తంలో సగం మించకుండా లేదా చెల్లించాల్సిన మొత్తానికి, చెల్లించాల్సిన మొత్తాన్ని సగం మించకుండా లేదా పాక్షిక చెల్లింపులు చేసేందుకు అనుమతిస్తోంది”.
విపత్తులు, ప్రజారోగ్య అత్యయిక పరిస్థితుల్లో ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థలు, విశ్వవిద్యాలయాలు, ఎయిడెడ్ సంస్థల ఉద్యోగుల వేతనాలు, పెన్షనర్ల పింఛన్లలో గరిష్ఠంగా 50శాతం కోత విధించేలా ఆర్డినెన్స్ రూపొందించింది. కోత విధించిన మొత్తాన్ని ఆర్నెల్లలో ఉద్యోగులు, పెన్షనర్లకు తిరిగి చెల్లించాలని పేర్కొంది. పెన్షనర్లకు పూర్తి పింఛను చెల్లించాలంటూ హైకోర్టులో వ్యాజ్యం నడుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. పింఛన్లలో కోత ఏ చట్ట ప్రకారం విధిస్తున్నారని ఇటీవల ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని ప్రశ్నించిన విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more