ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి దేశంలోనూ రోజురోజుకీ తన ప్రభావాన్ని పెంచుకుంటోంది. దీంతో దేశంలో ఇప్పటికే రమారమి మూడు లక్షల మంది దీన ప్రభావం భారిన పడ్డారు, రోజురోజుకీ వేల సంఖ్యలో్ వస్తున్న కరోనా పేషంట్లను చికిత్స చేయడంలో డాక్టర్లకు తలకుమించిన బారంగా తయారైంది. దీంతో కరో్నా పేషంట్ల విషయంలో డాక్టర్లు, ప్రభుత్వాలు సరిగ్గా వ్యవహరించడం లేదన్న వాజ్యాలు న్యాయస్థానాలలో దాఖలైనా.. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మాత్రం ఈ కేసులపై, మరణాలు, చికిత్సలపై సుమోటోగా విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా దేశ అత్యున్నత న్యాయస్థానం రాష్ట్రాలపై తీవ్రంగా మండిపడింది.
దేశ రాజధాని ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో పరిస్థితులు భయానకంగా ఉన్నాయని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. కరోనా రోగులకు చికిత్స, కరోనా మృతదేహాలకు అంత్యక్రియల నిర్వహణ తీరుపై మండిపడిన న్యాయస్థానం ఢిల్లీలో కరోనా రోగుల పట్ల జంతువుల కన్నా దారుణంగా వ్యవహరిస్తున్నారనీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆస్పత్రుల్లో మృతదేహాల నిర్వహణ కూడా సరిగ్గా లేదని తీవ్రంగా మండిపడింది. కరోనా బారిన పడి చనిపోయిన వారి మృతదేహాలను అత్యంత కట్టుదిట్టంగా అంత్యక్రియలు జరపాల్సివుండగా.. అవి చెత్తకుప్పలో కనబడటం వంటి దృశ్యాలు తీవ్ర ఆందోళనకరమి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కౌల్ ఆవేదన వ్యక్తంచేశారు.
దేశ రాజధాని నగరంలో కరోనా పరీక్షల శాతం ఎందుకు తగ్గడం పై కూడా ప్రభుత్వాన్ని అత్యున్నత న్యాయస్థానం నిలదీసింది. తొలుత కరోనా పరీక్షల నిర్వహణలో అగ్రస్థానంలో ఉన్న ఢిల్లీ క్రమంగా ఎందుకు పరీక్షలను నిర్వహించడం తగ్గించిందని ప్రశ్నించింది. గతంలో రోజుకు 7వేల పరీక్షలు చేస్తే.. ఇప్పుడు కేవలం 5వేల పరీక్షలే చేస్తుండటంపై సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. చెన్నై, ముంబై నగరాల్లో 16వేలు నుంచి 17వేలకు పరీక్షల సంఖ్య పెరిగిందని పేర్కొంది. ఇక కరోనా రోగులకు ఆస్పత్రుల్లో పడకలు లేవన్న మీడియాలో కథనాలు వస్తున్న తరుణంలో.. ప్రభుత్వాలు మాత్రం పడకలు ఖాళీగా ఉన్నాయని చెబుతున్నాయని చెప్పడం ఏంటని ఆగ్రహం వ్యక్తంచేసింది.
కరోనా లక్షణాలు కనిపించిన ప్రతీవారితో పాటు వారితో కాంట్రాక్టు అయిన వారందరికీ తక్షణం పరీక్షలు నిర్వహించాలని అదేశించిన న్యాయస్థానం.. ఈ క్రమంలో అవసరమైతే కరోనా పరీక్షల సంఖ్యను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిస్తామని తెలిపింది. కరోనాతో చనిపోతే వారి బంధువులకు కూడా సమాచారం ఇవ్వలేదన్న మీడియా కథనాలు చూస్తేనే పరిస్థితి అర్థం అవుతోందని కోర్టు వ్యాఖ్యానించింది. దిల్లీ సహా పలు రాష్ట్రాల్లో పరిస్థితులు భయానకంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తంచేసింది. దీనిపై సమాధానం చెప్పాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు దిల్లీ, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీచేసింది. అనంతరం తదుపరి విచారణను జూన్ 17కి వాయిదా వేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more