దేశపౌరులకు రిజర్వేషన్ అన్నది ప్రాథమిక హక్కు కాదని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 కింద దీనిని సవాలు చేయడం కుదరదని తేల్చిచెప్పింది. తమిళనాడు వైద్య కళాశాలల్లో ప్రవేశాల విషయమై అక్కడి రాజకీయ పక్షాలు వేసిన పిటిషన్ల విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేసింది. 2020-21కి సంబంధించి గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య, డెంటల్ వైద్యవిద్య కోర్సులను నీట్ ద్వారా భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే.
అయితే... ఆఖిల భారతానికి చెందిన కోటాలో తమిళనాడుకు సంబంధించిన సీట్లను సగం మేర ఓబీసీలకే కేటాయించాలని తమిళనాడు సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు కేంద్రానికి తమ తీర్మాణాన్ని కూడా పంపింది. కానీ కేంద్రం ఈ మేరకు తాము అనుమతి ఇవ్వలేమని తేల్చిచెప్పింది. దీన్ని వ్యతిరేకిస్తూ అన్నాడీఎంకే, డీఎంకే, సీపీఎం, సీపీఐ, తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ అంశంలో కేంద్ర ఆరోగ్యశాఖ, భారత వైద్య మండలి, జాతీయ పరీక్షల మండలిని ప్రతివాదులుగా పేర్కొంటూ నేతలు వైకో, అన్బుమణి రాందాస్లు కూడా వ్యాజ్యాలు దాఖలు చేశారు.
వీటిపై జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ ఎస్.రవీంద్ర భట్ల ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ‘‘రిజర్వేషన్ ప్రాథమిక హక్కు కాదు. రాజ్యంగంలోని ఆర్టికల్ 32 కింద దీనిని సవాలు చేయలేరు’’ అని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ఈ అంశంపై మద్రాస్ హైకోర్టుకు వెళ్లేందుకు అనుమతిస్తూ, పిటిషన్లను ఉపసంహరించుకునేందుకు అవకాశం కల్పించింది. ఒక అంశంపై తమిళనాడు రాజకీయ పక్షాలన్నీ ఏకతాటిపైకి రావడం పట్ల ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. మరోవైపు... రిజర్వేషన్ ప్రాథమిక హక్కు కాదన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more