అతి తీవ్ర తుపాను అంఫన్ తీరం దాటుతూ రెండు రాష్ట్రాల తీరప్రాంతాలను అల్లకల్లోలంగా మార్చివేసింది. మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో తీరాన్ని తాకిన అంఫన్.. సాయంత్రం ఆరున్నర గంటల వరకు సుమారుగా నాలుగు గంటలకు పైగా సమయం తీసుకుని తీరాన్ని దాటింది. ఈ మేరకు భారత వాతావరణ విభాగం అధికారులు తెలిపారు. తీరాన్ని దాటే ప్రక్రియ సందర్భంగా ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల తీర ప్రాంతాలను అతలాకుతలం చేసింది. బెంగాల్, బంగ్లాదశ్ మధ్య సుందర్భన్ సమీపంలో ఈ పెను తుఫాను తీరం దాటినట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
కాగా, ఇవాళ రాత్రి ఏడు గంటల తరువాత అతితీవ్ర తుఫాను సంపూర్ణంగా తీరం దాటిందని వెల్లడించిన అధికారులు.. ఈ సమయంలో వీచిన భీకర గాలులు ఇటు ఒడిశా, అటు పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలతో పాటు కోల్ కతా మహానగరంలోనూ బీభత్సం సృష్టించింది. ఈ తుఫాను ధాటికి ఇద్దరు మరణించారు. తుఫాను తీరం దాటుతున్న సమయంలో 160 కిలోమీటర్ల వేగంతో భీకర గాలులు.. దానికి తోడుగా భారీ వర్షం కొనసాగినట్టు అధికారులు తెలిపారు. ఆ తరువాత తుఫాను తీరం గాటే సమయానికి తీవ్రత కాసింత తగ్గి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయని అధికారులు తెలిపారు.
ఇక అంఫన్ తుఫాను బంగ్లాదే్శ్ వైపు పయనిస్తూ క్రమంగా బలహీనపడుతుందని, ఆ తరువాత క్రమంగా తీవ్ర వాయుగుండంగా మారుతుందని తెలిపారు. అంఫన్ తీరం దాటుతున్న సందర్భంగా ముందు జాగ్రత్త చర్యగా అధికారులు ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతంలోని దాదాపు 4.5 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సముద్రంలో పెద్ద ఎత్తున ఎగసిపడుతున్న అలలు పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలను ముంచెత్తాయని ఐఎండీ డైరెక్టర్ మృత్యుంజయ మహాపాత్రా తెలిపారు. ఈ తుఫాను నేపథ్యంలో తమ అంచనాలు అన్ని నిజమయ్యాయని ఆయన పేర్కోన్నారు.
అటు ఒడిశాలో 6.5లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఒడిశాలో పూరీ జిల్లాలోని హరిదాస్పూర్, కకట్పూర్లలో భారీ వర్షాలకు రోడ్లపై కూలిన చెట్లను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తొలగించారు. వాతావరణ శాఖ హెచ్చరికలతో కోల్కతాలో బంద్ వాతావరణం నెలకొంది. కరోనాతో విధించిన లాక్డౌన్ ఉత్తర్వులను సడలించడంతో తెరుచుకున్న మార్కెట్లను సైతం ఈ తుపాను దాటికి మూసివేశారు. భీకర గాలులు ధాటికి పెద్ద పెద్ద చెట్లు, విద్యుత్, టెలిఫోన్ స్తంభాలు నేలకూలాయి. వృక్షాలు కార్లపై పడటంతో వాహనాలు ధ్వంసమయ్యాయి. రోడ్లు బీటలు వారాయి. మొత్తానికి ప్రాణనష్టం తక్కువగానే వున్నా అస్తినష్టం మాత్రం చాలా వుందని రాష్ట్ర ప్రభుత్వాలు అంచనా వేస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more