దేశంలో కరోనా విజృంభన వేగంగా కోనసాగుతోంది. దేశంలో తొలి కరోనా కేసు నమోదైన 111 రోజులకు లక్ష మార్కును చేరిన కరోనా కేసులు ఆతరువాత రెండు రోజుల వ్యవధిలో మరింత వేగంగా వ్యాప్తించెందాయి. దేశంలో అత్యధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రపంచలోనే అత్యధిక కరోనా కేసులు నమోదైన జాబితాలో 11వ దేశంగా భారత్ నిలవడం అందోళన రేకెత్తుతోంది. దేశంలో ఏకంగా సగటున రోజుకు ఐదు వేల మందికి వైరస్ వ్యాప్తి చెందగా, గడిచిన 48 గంటల వ్యవధిలో పది వేలకు మించిన కరోనా కేసులు నమోదు కాడడటం అందోళన కలిగిస్తోంది.
ఇక గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా కొత్తగా 5609 పాజిటివ్ కేసులు నిర్థారణ అయ్యాయి, దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ 1,12,359 కేసులు నమోదయ్యాయి. ఇక దేశంలో నమోదవుతున్న మరణాలు కూడా ఆందోళన కొనసాగిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 132 మంది మరణించారు. దీంతో దేశవ్యాప్తంగా మరణాల సంఖ్య కూడా 3435కు చేరుకుందని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ పేర్కొంది. మహారాష్ట్రలో ఏకంగా అత్యధిక మరణాలు నమోదు చేసుకోవడం కలవరాన్ని గురిచేస్తోంది. కరోనా వైరస్ బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో దేశప్రజల్లో అందోళన కలుగుతోంది.
గత పన్నెండు రోజుల వ్యవధిలో ఏకంగా యాభై వేల కేసులు నమోదు కావడం కూడా అందోళన రేకెత్తిస్తోంది. కాగా ఈ మహమ్మారి బారిన పడిన వారిలో ఇప్పటి వరకు 45,300 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక 63,624మంది మాత్రం వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పోందుతున్నారు. గతకొన్ని రోజులుగా కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరగడం కాస్త ఊరటనిస్తోండగా, రానున్న రోజుల్లో కరోనా తీవ్రత మరింత పెరిగే అవకాశాలు వున్నాయని నిపుణులు అంచనాలు ప్రజలను అందోళనకు గురిచేస్తున్నాయి. కరోనా ప్రభావం అధికంగా మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లోనే నమోదు కావడం గమనార్హం.
దేశంలో కరోనావైరస్ బారిన పడి మరణించిన వారిలో అత్యదికులు మహారాష్ట్ర వాసులే కావడం గమనార్హం. గడిచిన 24 గంటల వ్యవధిలో 2000లకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఏకంగా కేసులు 40 వేల మార్కుకు చేరువయ్యాయి. తాజా గణంకాల ప్రకారం మొత్తం కేసుల సంఖ్య 39,297 కేసులు నమోదు కాగా, మహారాష్ట్రలో మరణాల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతుండడం అందోళన కలిగిస్తోంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1390 మంది కరోనా బారిన పడి మరణించారు. అటు దేశరాజధాని ఢిల్లీలో గడిచిన 24 గంటల వ్యవధిలోనే 534 కరోనా కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 11,088కి చేరింది.
తమిళనాడులోనూ పెద్ద సంఖ్యలోనే కరోనా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర తరువాత తమిళనాడులో అధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. తమిళనాడులో కరోనా సకేసుల సంక్య 13వేల మార్కు దాటింది. రాష్ట్రంలో మొత్తం కేసులు సంఖ్య 13191కి చేరాయి. అదే సమయంలో గుజరాత్ లోనూ కరోనా కేసులు విజృంభన కొనసాగుతోంది. ఈ రాష్ట్రంలోనూ కరోనా కేసుల సంఖ్య 13 వేల మార్కుకు చేరువలో వుంది. ప్రస్తుత గణంకాలను బట్టి రాష్ట్రంలో కరోనా కేసులు సంఖ్య 12, 537కు చేరుకుంది. అదే సమయంలో మధ్యప్రదేశ్ లో ఇప్పటి వరకు మొత్తం 5735 కేసులు నమోదు కాగా, 248 మంది మరణించారు, ఉత్తర్ ప్రదేశ్ లో 5175 కేసులు నమోదు కాగా, పశ్చమ బెంగాల్ లో 3103 కేసులు నమోదయ్యాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more