Woman and her boy friend held for Murder ప్రియుడి కోసం భర్త ఉసురు తీసిన భార్య

Illicit affair wife and her boyfriend held for killing husband

woman kills husband, husband killed by wife boy friend, Woman and her boy friend held for MurderBalasubrahmanyam, bookstall, Kadiri road, business, Tirupati, travels business, Renuka, Nagi Reddy, Madanapalle, oronavirus, COVID-19, chitoot Crime

The police have arrested a woman who killed her husband by crushing him with a lorry with the help of her boyfriend. This crime has taken place at Madanapalle town in Chittoor district.

ప్రియుడి మోజులో పడి భర్తను లారీతో ఢీకొట్టించిన భార్య..

Posted: 04/06/2020 06:12 PM IST
Illicit affair wife and her boyfriend held for killing husband

కరోనా వైరస్ పుణ్యమా అని నేరాలు తగ్గుతున్నాయని భావిస్తున్న వేళ చిత్తూరు జిల్లా మదనపల్లెలో దారుణ ఘటన వెలుగుచూసింది. కరోనావైరస్ నేపథ్యంలో రోడ్డపైకి జనం ఎవరే రావడం లేదని.. తాము చేసిన మర్డర్ కూడా ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసిన జంట ఎట్టకేలకు కటకటాలపాలైంది. ఎలాంటి భయంకరమైన వైరస్ వచ్చినా.. తమను కలుసుకోకుండా అడ్డుగా వున్న భర్తను హతమార్చింది ఓ భార్య, ప్రియుడి మోజులో పడి ఓ వివాహిత కట్టుకున్న భర్తను లారీతో ఢీకొట్టించి హత్య చేయించింది.

 పోలీసుల కథనం ప్రకారం.. పెద్దమండ్యం మండలంలోని చెరువుముందరపల్లెకు చెందిన బాలసుబ్రహ్మణ్యం (35).. 11 ఏళ్ల క్రితం నీరుగట్టువారిపల్లెకు చెందిన రేణుకను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మదనపల్లెలోని కదిరి రోడ్డులో గిఫ్ట్ సెంటర్ నిర్వహిస్తున్న ఈ దంపతులకు ముగ్గురు పిల్లలున్నారు. అయితే, వ్యాపారంలో నష్టం రావడంతో రెండేళ్ల క్రితం తిరుపతి వెళ్లిన బాలసుబ్రహ్మణ్యం ట్రావెల్స్ వ్యాపారం ప్రారంభించాడు. అయితే పిల్లల చదువులు అటంకం వద్దని భార్యపిల్లలను మాత్రం మదనపల్లెలోనే నివాసం వుంచాడు.

ఈ క్రమంలో రేణుకకు ఓ రాజకీయ పార్టీకి చెందిన సేవాదళ్ కార్యకర్త కె.నాగిరెడ్డితో ఏర్పడిన పరిచయం సన్నిహిత సంబంధానికి దారితీసింది. రెండేళ్ల తరువాత తిరుపతిలో ట్రావెల్స్ ను విక్రయించి బాలసుబ్రహ్మణ్యం తిరిగి మదనపల్లెకు చేరుకున్నాడు. దీంతో నాగిరెడ్డితో కలవడానికి సమయం చిక్కకపోవడంతో పార్టీ కార్యకాలాపాల పేరుతో రేణుక బయటకు వచ్చేది. ఈ క్రమంలో తన భార్య నాగిరెడ్డితో సన్నిహితంగా ఉండడాన్ని చూసి మందలించాడు. ఇదే విషయమై పలుమార్లు ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో భర్తను వదిలించుకోవాలని భావించిన రేణుక ఇదే విషయాన్ని ప్రియుడు నాగిరెడ్డికి చెప్పి భర్త హత్యకు ప్లాన్ చేసింది.

ఈనెల 4న బాలసుబ్రహ్మణ్యానికి జలుబు చేయడంతో, వెళ్లి మందులు తెచ్చుకోమంటూ రాత్రి 11 గంటల సమయంలో ఒత్తిడి చేసింది. అతడు బయటకు వెళ్లగానే విషయాన్ని ప్రియుడికి చేరవేసింది. సమయం కోసం వేచి చూస్తున్న నాగిరెడ్డి మందులు తీసుకుని వస్తుండగా లారీతో ఢీకొట్టి హత్య చేశాడు. బాలసుబ్రహ్మణ్యం సోదరుడు, న్యాయవాది అయిన కె.రఘుపతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేప్టటిన పోలీసులు అసలు విషయం రాబట్టారు. రేణుక, ఆమె ప్రియుడు నాగిరెడ్డి సహా మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles