దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తండ్రి మృతి కేసులో ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఉన్నావ్ బీజేపి మాజీ ఎమ్మెల్యే అయిన కులదీప్ సెంగార్ తో పాటు మరో ఆరుగురిని దోషులుగా తేలుస్తూ పదేళ్ల జైలు శిక్ష విధించింది. సెంగార్ తో పాటు ఆయన సోదరుడు అతుల్ సెంగార్ ను రూ.10లక్షలు చొప్పున బాధితురాలి కుటుంబానికి చెల్లించాలని న్యాయమూర్తి ధర్మేష్ శర్మ ఆదేశించారు. ఉత్తర్ ప్రదేశ్లోని ఉన్నావ్ కు చెందిన ఓ మైనర్ యువతిపై 2017లో అత్యాచారం చేసిన కేసులో బీజేపి ఎమ్మెల్యేగా ఎన్నికైన స్థానిక నేత కులదీప్ సెంగార్ దోషిగా తేలిన సంగతి తెలిసిందే.
అయితే ఈ కేసు విచారణలో ఉండగా పోలీస్ కస్టడీలో బాధితురాలి తండ్రి 2018 ఏప్రిల్ 9న మృతి చెందాడు. మైనర్ బాలికను అత్యాచారం చేసి.. న్యాయంకోసం పోరాడుతున్న కేసులో తండ్రిని పోలిస్ స్టేషన్ కు తీసుకువచ్చి.. కేసును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ దారుణంగా కొట్టడంతో ఆయన ప్రాణాలను కోల్పోయాడు. ఇంత జరిగినా కేసు పెట్టకుండా పోలీసులు బాధితురాలిని పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో తీవ్రంగా కలత చెందిన బాధితురాలు నేరుగా ముఖ్యమంత్రి అధిత్యనాథ్ క్యాంపు కార్యాలయం ఎదుట ఆత్మహత్యకు యత్నించడంలో అసలు విషయం మీడియాకు తెలిసింది.
ఈ ఘటనలో సెంగార్, ఆయన సోదరుడు, ఇద్దరు పోలీసు అధికారులు సహా మొత్తం ఏడుగురిని మార్చి 4న కోర్టు దోషులుగా తేల్చింది. తాజాగా దోషులకు శిక్షలు ఖరారు చేసింది. ఉన్నావ్ అత్యాచారం కేసు ఇప్పటి వరకు ఎన్నో మలుపులు తిరిగింది. 2018లో ఓ కేసులో అరెస్టయిన తండ్రి కస్టడీలో మరణించాడు. దీంతో పాటు ఉన్నావ్ బాధితురాలు సహా ఆమె కుటుంబ సభ్యులు కారులో వెళుతుండగా వారిపై హత్యాయత్నం జరిగింది. ఈ ఘటనలో కుటుంబ సభ్యులను సైతం బాధితురాలు కోల్పోయింది. ఆమె ప్రస్తుతం సీఆర్పీఎఫ్ సంరక్షణలో ఉంటోంది. గతేడాది డిసెంబర్ 20న అత్యాచారం కేసులో సెంగార్కు ఢిల్లీ కోర్టు జైలు శిక్ష విధించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more