దేశరాజధాని ఢిల్లీలో ఇవాళ వేకువ జామున కాల్పుల కలకలం రేగింది. అసలేం జరిగిందో తెలుసుకునే లోపు ఢిల్లీ పోలీసులు ఇద్దరు కరుడుగట్టిన నేరస్థులను హతమార్చారు. దోపిడీలు, దొంగతనాలు, కిడ్నాప్ లు, హత్య కేసుల్లో నిందితులుగా ఉన్న ఇద్దరు దుండగులు పోలీసుల కళ్లు కప్పి తప్పించుకుని పారిపోతున్న క్రమంలో ఢిల్లీ పోలీసులు వారిని నడిరోడ్డుపైనూ మట్టుబెట్టారు. ఇద్దరు దుండగులను రఫీక్ అలియాస్ రాజా ఖురేషీ అలియాస్ రాజా ఫహీల్వాన్, రమేశ్ బహదూర్ లని పోలీసులు పేర్కోన్నారు.
వీరిద్దరూ ఢిల్లీలోని ప్రహ్లాద్ పూర్ లో తలదాచుకున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసు ప్రత్యేక బృందం వారిని గాలిస్తూ ఆ ప్రాంతానికి చేరుకుంది. వారిని చూసి అప్రమత్తమైన దుండగులు పోలీసులపైకి కాల్పులు ప్రారంభించి తప్పించుకునే ప్రయత్నం చేశారు. వెంటనే పోలీసులు కూడా ఎదురు కాల్పులు ప్రారంభించారు. హోరాహోరీగా జరిగిన ఈ కాల్పుల్లో నిందితులు ఇద్దరూ తీవ్రగాయాల పాలయ్యారు. వారిని హుటాహుటిన అసుపత్రికి తరలించగా అప్పటికే వారు మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.
వేకువజాము ఉదయం ఐదు గంటల సమయంలో ఈ ఎదురుకాల్పులు జరుగడంతో.. అసలేం జరుగుతుందో అర్థంకానీ స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఘటనపై ఢిల్లీ స్పెషల్ సెల్ డీసీపీ పీఎస్ కుహ్వాహ్ మాట్లాడుతూ తాము నిందితులు కాల్పులు జరుగుతున్నా తాము.. కొంతసేపు సహనంతో వారిని లొంగిపోవాలని చెప్పామని అయినా వారు కాల్పులకు తెగబడటంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో తమ బలగాలు కాల్పులు జరిపాయన్నారు. అయితే ఈ ఎన్ కౌంటర్లో తమ బలగాలే లైఫ్ ఫ్రూప్ జాకెట్లు ధరించడం వల్ల ఎలాంటి గాయలు కాలేదని ఆయన తెలిపారు.
కాగా మృతుడు రఫీక్ అలియాస్ రాజా ఉత్తర్ ప్రదేశ్ లోని గజియాబాద్ కు చెందిన లోని ప్రాంతానికి చెందినవాడు కాగా, రమేష్ బహదూర్ మాత్రం ఢిల్లీలోని కరావాల్ నగర్ ప్రాంతంలోని శివ్ విహార్ కు చెందినవాడని పోలీసులు తెలిపారు. నిందితులిద్దరూ అనేక కేసుల్లో వాంటెండ్ జాబితాలో వున్నవారేనని అన్నారు. వీరిపై ఓ హత్యకేసు కూడా నమోదు అయ్యిందని అన్నారు. రఫీక్ అత్యంత కరుడుగట్టిన నేరస్థుడని, దోపిడీలు, బెదిరింపులకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. వీరిద్దరూ ఈ నెల 12 ఇద్దరు పోలీసులపై దాడి చేశారని కూడా డీసీపీ తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more