అమరావతిలోనే రాష్ట్ర రాజధానిని కొనసాగించాలని.. రాజధాని కోసం తమ భావితరాల బంగారు భవిష్యత్తు కోసం తాము చేసిన త్యాగాలను సహృద్భావంతో అర్థం చేసుకోవాలని కోరుతూ గత 24 రోజులుగా రాజధాని ప్రాంత రైతులు దీక్షలు, ధర్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో అక్కడి రైతులు సీఎం కాన్వాయ్ కు నల్లజెండాలు చూపడం.. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని ప్లకార్డులు ప్రదర్శించడంతో.. పోలీసు ఉన్నాతాధికారుల అంక్షితలతో స్థానిక అధికారుల మరింత అప్రమత్తమయ్యారు. ఆ తరువాత మళ్లీ ముఖ్యమంత్రి కి ఇలాంటి పరిణామాలు ఎదురుకాకుండా చర్యలు తీసుకున్నారు.
అయితే రాష్ట్ర మంత్రి సురేష్ కుమార్ సహా ప్రభుత్వ ప్రధాన విఫ్ పిన్నెల్లికి మాత్రం స్థానిక రైతులు నిరసన సెగలు తాకాయి. కారులో అమరావతికి చేరుకుంటున్న ఆయన కారును అడ్డగించిన రైతులు ఆయనను ఘెరావ్ చేశారు. అంతటితో ఆగకుండా ఆయన కారును సైతం ధ్వంసం చేశారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన పిన్నెల్లి.. వాళ్లు రైతులు కాదు.. టీడీపీ కార్యకర్తలేనని అరోపించారు. రైతులు మందుకొట్టి ఉద్యమాలు చేయడానికి వస్తారా.? అంటూ ప్రశ్నించారు. ఆ తరువాత జాతీయ రహదారులు దిగ్భదం.. మహాధర్నా.. చంద్రబాబు బస్సుయాత్ర.. జేఏసీ నేతల అరెస్టు.. ఇలా అమరావతి ప్రాంతంలో అనేక నిరసన కార్యక్రమాలు జోరందుకున్నాయి.
నిరసన కార్యక్రమాల హోరు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఇశాళ ఆయా ప్రాంతాల రైతులు తలపెట్టిన పాదయాత్ర కార్యక్రమాన్ని పోలీసులు భారీ సంఖ్యలో మొహరించి నిలువరిస్తున్నారు. రాజధాని ప్రాంత 29 గ్రామాల్లో సెక్షన్ 144, సెక్షన్ 30 అమల్లో వున్నాయిని ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని కూడా పిలుపునిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసు బలగాలు ఓ గ్రామంలో మొహరించిన దృష్యాలను అక్కడి స్థానికులు తమ మొబైల్ ఫోన్లలో బంధించారు. ఈ విధంగా తమను పండగను దూరం చేస్తున్నారని, తమను అదుకోవాలని పిలుపునిస్తున్నారు.
అమరావతి ప్రాంతంలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను ఇంట్లోంచి కూడా బయటకు రానీయని పరిస్థితులు కల్పించి.. రాజన్న రాజ్యాన్ని ఎలా తీసుకోస్తారని రాజధాని ప్రాంత రైతులు పోలీసులను నిలదీస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల నుంచి తమను అదుకునేందుకు 13 జిల్లాల రైతులు కలసి రావాలని పిలుపునిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టంట్లో వైరల్ గా మారింది. దీంతో టీడీపీ యువనేత నారా లోకేష్ కూడా ఈ పోలీసలు బలగాలపై స్పందించారు.
రాజధాని గ్రామాలు బోర్డర్ ను తలపిస్తున్నాయని నారా లోకేశ్ అన్నారు. పాకిస్థాన్ బోర్డర్ లో కూడా ఇంత మంది పోలీసులు ఉండరని మండిపడ్డారు. అన్యాయంగా, పోలీసు బలంతో ఉద్యమాన్ని అణచివేసేందుకు ముఖ్యమంత్రి జగన్ యత్నిస్తున్నారని, యుద్ధ వాతావరణాన్ని తీసుకొస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమాన్ని ఎంత అణచివేస్తే అంత ఉగ్రరూపం దాలుస్తుందని చెప్పారు. రైతులను రెచ్చగొట్టే చర్యలను వైసీపీ ప్రభుత్వం మానుకోవాలని హితవు పలికారు. దీంతోపాటు, రాజధాని ప్రాంతంలో భారీ సంఖ్యలో కవాతు చేస్తున్న పోలీసుల వీడియోను షేర్ చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more