కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు, ప్రజావ్యతిరేక ఆర్థిక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా భారత్ బంద్ కొనసాగుతుంది. కార్మికులకు సంబంధించిన 44 చట్టాలను సవరించి నాలుగు కోడ్ లుగా విభజించే బిల్లును వ్యతిరేకిస్తూ.. దానిని వెంటనే కేంద్రం ఉపసంహరించుకోవాలని డిమాండ్ తో జాతీయ కార్మిక సంఘాలు భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. కేంద్రం కార్మికుల హక్కులను కాలరాస్తూ.. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని.. పారిశ్రామిక వేత్తలకు మాత్రం లబ్దిచేకూర్చుతుందని కార్మిక సంఘాల నేతలు దుయ్యబట్టాయి.
దేశంలోని పబ్లిక్ సెక్టార్ సంస్థలను సైతం ప్రైవేటుపరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన భారత్ బంద్ లో బ్యాంకింగ్ రంగ కార్మిక సంఘాలు సైతం మద్దతు ప్రకటించడంతో దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలు మృగ్యమయ్యాయి. కార్మికుల వేతనా సవరణ, మినిమమ్ వేతనాల పెంపు, పబ్లిక్ సెక్టార్ సంస్థల ప్రైవేటీకరణ, సీఏఏ చట్టం ఉపసంహరణ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్లను వ్యతిరేకిస్తూ పది జాతీయ కార్మిక సంఘాలు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. వీరికి విద్యార్థి, రైతు సంఘాలు కూడా మద్దతు ప్రకటించిన తరుణంలో బంద్ పలు రాష్ట్రాల్లో ప్రభావాన్ని చూపుతుంది. ప్రధానంగా ఉత్తరాది జిల్లాల్లో అధిక ప్రభావం కనబడుతొంది.
ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంటోంది. కూచ్ బెహర్ లో ఆందోళనకారులు ఓ బస్ ను ధ్వంసం చేశారు. తమ ప్రాంతంలోకి బస్సు రాగానే దానిపై రాళ్లు రువ్వి, దాని అద్దాలను పగులకొట్టారు. దీంతో అందులోని ప్రయాణికులు వణికిపోయారు. అనంతరం బస్సు దిగి వెళ్లారు. బస్సుపై దాడి చేసిన యువకులు ముఖానికి ముసుగులు ధరించి ఉన్నారు. దాడి అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో మీడియాకు చిక్కింది. బీఎంఎస్ మినహా అన్ని కార్మిక, రైతు, ఆటో సంఘాలు ఈ సమ్మెకు మద్దతు తెలిపాయి.
#WATCH West Bengal: A bus vandalised in Cooch Behar during the Bharat Bandh called by ten trade Unions against 'anti-worker policies of Central Govt' pic.twitter.com/LNFdWX2UWB
— News90Degree (@News90Degree) January 8, 2020
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more