మహారాష్ట్రలో అనూహ్య రాజకీయా పరిణామాలను చవిచూసిన దేశప్రజలు.. తాజాగా కర్ణాటకలో ఆ మార్పులు గమనాన్ని ఆసక్తిగా గమనిస్తున్నారు. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు శరద్ పవార్ ను బ్యాంకు నిధుల వ్యవహారంలో విచారిస్తారని వార్తలు రావడంతో ఆయనే స్వయంగా అధికారుల వద్దకెళ్లిన విషయం తెలిసిందే. అయితే కర్ణాటకలో సరిగ్గా ఉపఎన్నికలకు ముందు మాజీ ముఖ్యమంత్రులు కుమారస్వామి, సిద్ధరామయ్యలపై బెంగళూరు పోలీసులు రాజద్రోహం కేసు నమోదు చేశారు. దీంతో వీరిని కూడా సరిగ్గా ఎన్నికల ముందు అదుపులోకి తీసుకుంటారన్న వార్తలు వినిపిస్తున్నాయి.
సాక్ష్యాత్తు జాతిపిత మహాత్మాగాంధీని తుపాకీతో కాల్చిన వ్యక్తిని దేశభక్తుడని పార్లమెంటులో పేర్కోన్న వ్యక్తులపై ఎలాంటి చర్యలను తీసుకోని అధికారులు, సామాజిక కార్యకర్తలు.. రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగాంగా తమ పార్టీ నేతలను టారెట్ చేస్తూ వారిపై కేసులు బనాయిస్తున్నారని, రాజ్యాంగం కల్పించిన హక్కు మేరకు నిరసనను వ్యక్తం చేస్తే వారిపై కేసులు నమోదు చేయాలని పిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారుతోంది. అధికారుల చర్యలపై నిలదీస్తే.. రాజద్రోహం కింద కేసులు బనాయించాలని అంటారా.? అన్న ప్రశ్నలు కూడా తెరపైకి వస్తున్నాయి.
ఈ ఏడాది మార్చి 27న అప్పటి ముఖ్యమంత్రి కుమారస్వామి, అప్పటి ఉపముఖ్యమంత్రి జి. పరమేశ్వర, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, సంకీర్ణ ప్రభుత్వంలోని కొందరు మంత్రులు, ఎంపీలు తదితరులు క్వీన్ రోడ్డులోని ఐటీ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. కాంగ్రెస్, జేడీఎస్ నేతల ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులకు వ్యతిరేకంగా ఈ ఆందోళన చేశారు. ఐటీ అధికారులు భాజపా ఏజెంట్లు అంటూ నినాదాలు చేశారు. అయితే ఈ వ్యవహారంపై మల్లికార్జున అనే వ్యక్తి స్థానిక న్యాయస్థానంలో ఫిర్యాదు చేశారు.
ఐటీ దాడులపై అప్పటి ముఖ్యమంత్రి కుమారస్వామి తమ పార్టీ నేతలకు ముందే సమాచారం లీక్ చేశారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. అందుకే ఐటీ అధికారులు సోదాలకు వెళితే కాంగ్రెస్, జేడీఎస్ నేతలు అడ్డుకున్నారని ఆరోపించారు. మల్లికార్జున ఫిర్యాదును స్వీకరించిన న్యాయస్థానం.. మాజీ ముఖ్యమంత్రులు సహా సంకీర్ణ నేతలపై రాజద్రోహం కేసు నమోదు చేయాలంటూ పోలీసులను ఆదేశించింది. కాగా.. దీనిపై కర్ణాటక మాజీ మంత్రి డీకే శివకుమార్ స్పందించారు. రాజకీయ కుట్రలో భాగంగానే తమ పార్టీ నేతలపై కేసులు పెట్టారని, దీనిపై తాము పోరాడుతామని అన్నారు. అవసరమైతే జైలుకైనా వెళ్తామని చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more