సంచలనం సృష్టించిన వెటర్నరీ వైద్యురాలు డాక్టర్ ప్రియాంక హత్య కేసులో పోలీసుల తక్షణ చర్యలు చేపట్టకపోవడంతోనే తమ బిడ్డ దుర్మార్గుల చేత చిక్కి నరకయాతన అనుభవించి అనంతలోకాలకు తరలివెళ్లిందని ప్రియాంకారెడ్డి తండ్రి శ్రీధర్ రెడ్డి పోలీసులపై సంచలన అరోపణలు చేశారు. తమ కూతురు ఆపదలో వుందని, అదృశ్యమైయ్యిందని పోలిస్ స్టేషన్ కు వస్తే.. పోలీసులు అవమానక రీతిలో బాయ్ ఫ్రెండ్ తో వెళ్లి వుంటుందని వ్యాఖ్యలతో కాలయాపన చేశారని ఆయన అరోపించారు.
తన కూతురు ఫోన్ రాత్రి 10 గంటలకు స్విచ్ఛాప్ కావడంతో అందోళన చెందిన తాము రాత్రి 11 గంటల సమయంలో శంషాబాద్ పోలీసులకు పిర్యాదు చేశామని తెలిపారు. అయితే పోలీసులు అమ్మాయిని వెతకడం ప్రారంభించేందుకు బదులు సీసీ కెమెరాల ఫూటేజిని చూస్తు కూర్చోవడం వల్లే తమ కూతురు ప్రాణాలు కోల్పోయిందని అన్నారు. తాను పిర్యాదు చేయగానే పోలీసులు గాలింపు చేపట్టి వుంటే తమ కూతురు సజీవంగా వుండేదని అన్నారు. ముందస్తు చర్యలు తీసుకోవడంలో శంషాబాద్ పోలీసులు నిర్లక్ష్యంగా వ్వవహరించారని అయన అరోపించారు.
ఈ విషయాన్ని ఫిర్యాదు చేయడానికి వెళ్తే వేరే పోలిస్ స్టేషన్ కు వెళ్లాలని పోలీసులే ఉచిత సలహాలు ఇస్తున్నారని ఆయన వాపోయారు. మనిషి మరణించిన తరువాత ఎన్ని బృందాలతో వెతికితే లాభం ఏంటని ఆయన ప్రశ్నించారు. ప్రజా రక్షణ కోసం వున్న పోలీసుల వద్దకు వస్తే.. తామేదో నేరం చేశామన్న భావన కలిగేలా ప్రవర్తిస్తున్నారని అరోపించారు. తమకు ఆపద వచ్చినప్పుడు కాకుండా.. పోలీసులకు తీరిక వున్నప్పుడు తాము పిర్యాదులు చేయడానికి వెళ్లలా.? అని ఆయన ప్రశ్నించారు. ఈ కేసులో పోలీసులు వ్యవహరించిన తీరుపై అడిగిన ప్రశ్నలకు మంత్రి తలసాని శ్రీనివాస్ దాటవేత ధోరణిలో సమాధానాలు మీరే చూడండీ..
ప్రియాంకారెడ్డి హత్యకేసు తెలుగురాష్ట్రాలలో సంచలనంగా మారడంతో పోలీసులు ఈ కేసు చేధనను సవాల్ గా తీసుకున్నారు. దీంతో 24 గంటలు కూడా తిరగకముందే ఈ కేసులో సైబరాబాద్ పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసుకు సంబంధించి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ దారుణమైన ఘాతుకానికి పాల్పడిన నిందితులందరూ పాతికేళ్ల లోపు యువకులేనని పోలీసుల విచారణలో తేలిందని సమాచారం. వీరిని రంగారెడ్డి జిల్లాకు చెందిన వారిగా అనుమానిస్తున్నారు.
ప్రియాంక హత్యకేసులో ఐదుగురు వ్యక్తులకు ప్రమేయముందని పోలీసులు అనుమానిస్తున్నా వారిని అదుపులోకి తీసుకోగా, వారిలో ఒకరు నిందితుడు మాత్రం ఇప్పటికీ పరారీలో వున్నాడని తెలుస్తోంది. వీరంతా ప్రియాంకా సాయంత్రం తన బైక్ ను పార్క్ చేసినప్పుడే అమెను గమనించి.. పథకాన్ని రచించారని.. తెలుస్తోంది. అయితే వారి పథకంలో భాగంగానే కారు పంక్చర్ చేసి.. జనసాంధ్రత వున్న ప్రదేశం నుంచి అమెను నిర్జన ప్రదేశానికి వచ్చేలా చేసేందుకు పంక్చర్ వేయిస్తామని నాటకాన్ని అడారని తెలుస్తోంది.
కాగా ఈ కేసులో నారాయణ పేట, మక్తల్ మండలం జక్లేరుకు చెందిన మహ్మద్ పాషాను అరెస్టు చేశారు. ఈ కేసులో ఇతడే ప్రధాన నిందితుడు. అదే మండలంలోని గుడిగండ్లకు చెందిన చెన్నకేశవులు, జొల్లు నవీన్, జొల్లు శివతో పాటు మరో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. హైదరాబాద్ నుంచి రాయచూర్ కు డీసీఎంలో నిందితులు స్టీల్ రాడ్లను తరలించే పనిలో ఉన్నట్లు తెలిపారు. లారీ డ్రైవర్లు, క్లీనర్లుగా పనిచేస్తోన్న వీరే ప్రియాంకారెడ్డిని హత్య చేసినట్లు నిర్ధరణకు వచ్చారు. కాసేపట్లో వీరిని మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more