ఆంధ్ర్రప్రదేశ్ అధికార పార్టీ వైఎస్సార్సీపీ నేతలు ఏర్పాటు చేసిన ప్రైవేలు విందుకు హాజరుకావడమే కాకుండా.. పీకల వరకు మద్యం సేవించి.. వారి పార్టీ పాటలపై నేతలతో కలసి చిందేసిన ఎమ్మార్వోపై అధికారులు కొరడ ఝుళిపించారు. అంతేకాదు ఓ ప్రభుత్వ అధికారిగా కొనసాగుతూ ఓ పార్టీకి వత్తాసు పలికేలా చిందులేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ నేతల పార్టీకి వెళ్లి.. అక్కడ మందేసి, చిందేసిన ఘటనపై సంజాయిషీ ఇవ్వాలని కోరుతూ షోకాజ్ నోటీసును అధికారులు జారీ చేశారు. ఎమ్మార్వో చిందేసిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారిన నేపథ్యంలో అధికారులు ఈ ఘటనపై చర్యలు తీసుకున్నారు.
శ్రీకాకుళం జిల్లా భామిని ఎమ్మార్వో నరసింహమూర్తి ఇటీవల వైఎస్సార్సీపీ నేతలు ఏర్పాటు చేసిన ఓ ప్రైవేటు విందు కార్యాక్రమాన్నికి హాజరై ఆయన మద్యం సేవించి.. చిందేశారు. ఈ వీడియో వైరల్ గా మారి అధికారులు పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్న క్రమంలో.. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ నివాస్ ఆదేశాలతో ఎమ్మార్వోకు పాలకొండ ఆర్డీవో షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నరసింహమూర్తి జరిగిన ఘటనపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న అధికారులు.. ఎమ్మార్వోపై శాఖాపరంగా కూడా విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది.
మరిన్న వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాకుళం జిల్లాలో భామిని ఎమ్మార్వో నరసింహమూర్తికి అధికార వైఎస్సార్సీపి పార్టీకి ఆహ్వానం లభించింది. ఇక అది ఆదివారం కావడంతో.. తన వ్యక్తిగత పార్టీగా మార్చుకున్నారు ఎమ్మార్వో. ఈ పార్టీకి తనతో పాటు మండల రెవెన్యూ కార్యాలయానికి చెందిన తన సిబ్బంది కూడా వస్తున్నారని సమాచారం రావడంతో వెళ్లారు. వైఎస్సార్సీపీ నేతలు స్థానికంగా వున్న ఓ తోటలో పార్టీని ఏర్పాటు చేశారు. తోటి ఉద్యోగులతో కలిసి పార్టీ చేసుకొని ఎమ్మార్వో కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు. విందు నేపథ్యంలో మందు కూడా లాగించిన ఎమ్మార్వో.. ఆ తర్వాత అధికార నేతలతో కలిసి అదే తోటలో.. అధికార పార్టీ పాటలకు డ్యాన్సులు కూడా చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాతో పాటూ వాట్సాప్లో వైరల్ కావడంతో ఈ వ్యవహారం బయటపడింది.
పాలకొండ నియోజకవర్గానికి చెందిన స్థానిక వైఎస్సార్సీపీ నేతలు భామిని సమీపంలోని ఏర్పాటు చేసిన పార్టీలో ఎమ్మార్వో నరసింహమూర్తి, వైఎస్సార్సీపీ నేతల డాన్సుల వీడియోలను తీసిన పలువరు వాటిని సోషల్ మీడియతో పాటూ వాట్సాప్ లో షేర్ చేయడంతో వైరల్ అయ్యింది. దీంతో అధికారులు సీరియస్గా స్పందించారు. దీనిపై షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసిన అధికారులు.. సంజాయిషీ చెప్పాలని పేర్కోన్నారు. జిల్లా కలెక్టర్ నివాస్ దృష్టికి ఈ వీడియోలు చేరాయి. జిల్లా రెవెన్యూ సిబ్బంది వ్యవహార తీరు ఎలా వుందో చూడాలంటూ వారు ఈ వీడియోను పోస్టు చేయడంతో.. ఆయన దానిపై సీరియస్ అయ్యారు. ఎమ్మార్వోపై తక్షణం చర్యలు తీసుకోవాలని అర్డీఓను అదేశించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more