కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు, గాంధీ కుటుంబంగా పేరుగాంచిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలకు గత 28 ఏళ్ళుగా కొనసాగించిన భద్రతను కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం కుదించి.. అంతకుపూర్వం వున్న జడ్ ప్లస్ భద్రతను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ అంశమై ఇటు పార్లమెంటు లోపలా, వెలుపల ఆందోళనకు దిగుతున్నారు. ఈ క్రమంలో ఇవాళ ఈ అంశంపై కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఉన్నతాధికారులు స్పందించారు.
గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రత ముగిసిన అంశంగా కేంద్రహోం మంత్రిత్వశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. అయితే ఈ అంశంలో కాంగ్రెస్ ప్రశ్నలను సంధించవచ్చునని కేంద్ర వర్గాలు స్పష్టం చేశాయి. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని ఎల్టీటీఈ తీవ్రవాదులు హత్యచేసిన నేపథ్యంలో 1991 మే 21 నుంచి సోనియాగాంధీతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు ఎస్పీజీ భద్రత కల్పించారు. కాగా అప్పటి నుంచి ఈ ఏడాది నవంబర్ 8 వరకు కొనసాగింది. నవంబర్ 8న గాంధీ కుటుంబ భద్రతను కుదిస్తూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది.
కాగా ఇదే అంశాన్ని ఇవాళ రాజ్యసభలో ప్రస్తావించిన కేంద్రమాజీ మంత్రి ఆనంద్ శర్.. రాజీవ్ గాంధీ హత్యోదంతం తరువాత అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్ పాయ్ గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భధ్రత కల్పించారని గుర్తుచేశారు. అయితే ప్రస్తుతం అధికారంలో వున్న అదే ఎన్డీయే ప్రభుత్వం మాత్రం కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతోందని అరోపించారు. గాంధీ కుటుంబాన్ని ఇబ్బందుల పాలు చేయడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. దీనికి కేంద్రమంత్రి జేపీ నడ్డా బదులిస్తూ ఈ నిర్ణయంలో ఎలాంటి రాజకీయ కారణాలు లేవు, కక్షపూరిత చర్యలు అంతకన్నా లేవని వివరించారు. ఇక గాంధీ కుటుంబానికి భద్రతను ఎత్తివేయలేదని కూడా స్పష్టం చేశారు.
గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రత ఎత్తివేసిన నేపథ్యంలో జడ్ ప్లస్ సెక్యూరిటీ అమల్లోకి వచ్చింది. దీంతో వారి భద్రత కల్పించే దళాల కోసం పదేళ్ల క్రితం నాటి వాహనాలను కేటాయించారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనాలకు బదులు 2010 మోడల్ టాటా సఫారీ వాహనాలను కేంద్రం కేటాయించింది. ఈ వాహనాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోనియా కుటుంబానికి బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించాలని కోరినప్పటికీ అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేదని తెలుస్తోంది. మాజీ ప్రధాని రాజీవ్గాంధీ హత్య తర్వాత సోనియా కుటుంబానికి ఎస్పీజీ భద్రత కల్పించారు. ఇప్పుడు దానిని తొలగించి జడ్ప్లస్ భద్రతను కేటాయించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more