టాలీవుడ్ ప్రముఖులే లక్ష్యంగా రాష్ట్రంలో ఆదాయపన్నుశాఖ దాడులు కోనసాగుతున్నాయి. ఇవాళ ఉదయం నుంచి తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు నిర్మాతలు, హీరోల ఇళ్లు, కార్యాలయాలపై ఈ దాడులు జరుగుతున్నాయి. ప్రముఖ నిర్మాత దగ్గుబాటు సురేష్ ఇంటితో పాటు దగ్గుబాటికి చెందిన పది కంపెనీలు, రామానాయుడు స్టూడియోలు, ప్రోడక్షన్స్ కార్యాలయాల్లోనూ ఆదాయపన్ను శాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. దగ్గుబాటితో పాటు టాలీవుడ్ పరిశ్రమకు చెందిన హీరో నాని నివాసంతో పాటు ఆయన ప్రోడక్షన్ హౌజ్ కార్యాలయంలోనూ ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.
ఇవాళ ఉదయం పలు బృందాలుగా విడిపోయిన ఐటీ అధికారులు దగ్గబాటి సురేష్ ఇంటితో పాటు రామానాయుడు స్టూడియో, ఆయనకు చెందిన ప్రోడక్షన్ కార్యాలయాలు, కంపెనీలపై అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. సురేష్ తో పాటు ఆయన సోదరుడు ప్రముఖ హీరో దగ్గుబాటి వెంకటేష్ అలియాస్ విక్టరీ వెంకటేష్ ఇళ్లపై కూడా ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. గత నాలుగేళ్లుగా ఆదాయ, వ్యయాల్లో తప్పుడు లెక్కలు చూపుతున్నారన్న సందేహాలతో అదాయపన్ను శాఖ అధికారులు ఈ దాడులు చేస్తున్నారని సమాచారం.
రామానాయుడు స్టూడియోస్ పై ముందుగా దాడి చేసిన ఐటీ అధికారులు, కొద్దిసేపటి తరువాత జూబ్లీహిల్స్ లోని దగ్గుబాటి సురేశ్ బాబు, హీరో వెంకటేశ్ ఇళ్లలోనూ తనిఖీలు ప్రారంభించారు. సురేశ్ ప్రొడక్షన్స్ తీసిన సినిమాలు, వాటికి వచ్చిన కలెక్షన్స్ తదితర వివరాలను వీరు పరిశీలిస్తున్నట్టు సమాచారం. సురేశ్ ప్రొడక్షన్స్ కార్యాలయంలోనూ అధికారులు పలు పత్రాలను పరిశీలిస్తున్నారు. దాదాపు 60 మందికి పైగా ఐటీ విభాగం అధికారులు, సిబ్బంది ఈ తనిఖీలను జరుపుతున్నారని తెలుస్తోంది. దగ్గుబాటి రాణాతో సురేష్ ప్రోడక్షన్ హిరణ్య కశిప అనే భారీ బడ్జెట్ చిత్రాన్ని రూపోందిస్తున్న నేపథ్యంలో ఇక్కడ దాడులు జరుగుతున్నాయా.? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
ఇదే సమయంలో హీరో న్యాచురల్ స్టార్ నానికి కూడా ఐటీ అధికారులు ఝలక్ ఇచ్చారు. ఆయన నివాసంపై కూడా అదాయపన్ను శాఖ అధికారులు దాడులు జరుపుతున్నారు. జూబ్లీహిల్స్ లోని నాని నివాసం, ఆయన హాసినీ అండ్ హారికా క్రియేషన్స్ ప్రోడక్షన్ కార్యాలయంలో ఐటీ అధికారులు సోదాలను నిర్వహిస్తున్నారు. ఫలక్ నుమా దాస్ చిత్ర హీరో విశ్వసేన్ నాయుడుతో చిత్రాన్ని ప్రకటించడంతో పాటు ఇదివరకే ప్రకటించిన పలు ప్రాజెక్టులు ప్రోగ్రెస్ లో వున్న నేపథ్యంలో ఆయన నిర్మాణ సంస్థ కార్యాలయాలపై కూడా ఐటీ అధికారులు టార్గెట్ చేశారు. ఐటీ దాడుల నేపథ్యంలో టాలీవుడ్ ఒక్కసారిగా షాక్ కు గురైంది. కాగా, అదాయపన్ను శాఖ అధికారులు మాత్రం ఇవి రోటిన్ గా జరిగే దాడులేనని చెబుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more