యావత్తు తెలంగాణ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న హుజూర్నగర్ ఉప-ఎన్నికల ఓట్ల లెక్కింపులో అధికార టీఆర్ఎస్ పార్టీ రికార్డ్ బ్రేక్ చేసింది. గత నాలుగు పర్యాయాలుగా ఇక్కడి నుంచి బరిలో నిలిచి పిసిసి అధ్యక్ష పదవిని అందుకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఈ సారి ఓటమిని చవిచూడక తప్పలేదు. రమారమి ఏడాది క్రితం జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఈ స్థానం నుంచి గెలుపోందిన ఉత్తమ్.. ఆ తరువాత వచ్చిన సార్వత్రిక ఎన్నికలలో పార్లమెంటు సభ్యుడిగా కూడా ఎన్నికయ్యాడు. దీంతో ఈ స్థానంలో ఉప ఎన్నిక తప్పలేదు.
అయితే తానే పీసీసీ అధ్యక్షుడు కావడంతో వచ్చిన అవకాశాన్ని తన సతీమణి పద్మావతికి అందించాడు. ఏడాది క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఆమె పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దీంతో అమెను అభ్యర్థిగా ప్రకటించిన ఆయన.. అమె అదృష్టాన్ని మరోసారి పరీక్షించాడు. అయితే ఏడాది క్రితం రిపీట్ అయిన ఫలితమే మరోమారు పునరావృతం అయ్యాయి. హుజూర్ నగర్ ను తన ఖిల్లాగా మార్చుకున్న ఉత్తమ్.. అందులోనూ దశాబ్దాలుగా కాంగ్రెస్ కు అనుకూలంగా వున్న నల్గోండ జిల్లా.. ఈ ఉపఎన్నికలో మారిపోయింది.
ఇవాళ సూర్యాపేటలోని కొత్త వ్యవసాయ మార్కెట్టు గొడౌన్ లోనే లెక్కింపు ప్రారంభమైంది. తొలి రౌండ్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ఆధిక్యత చూపుతున్నారు. లెక్కింపునకు మొత్తం 14 టేబుళ్లు ఏర్పాటు చేయగా, 22 రౌండ్లు జరగనుంది. ఒక్కో టేబుల్ కు కౌంటింగ్ సూపర్వైజర్, అసిస్టెంట్, పరిశీలకుడిని నియమించారు. లెక్కింపు ప్రక్రియను జిల్లా సాధారణ పరిశీలకుడు సచీంద్ర ప్రతాప్ సింగ్ పర్యవేక్షిస్తున్నారు. ప్రతి రౌండుకు ర్యాండమ్ గా రెండు ఈవీఎంల ఫలితాలు సరిచూసిన తర్వాతే.. ఫలితాన్ని వెల్లడిస్తున్నారు.
లెక్కింపులో భాగంగా తొలుత ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ ఫర్ పోస్టల్ బ్యాలెట్ సర్వీసు ఓట్ల లెక్కించారు. కాంగ్రెస్ కంచుకోటలో గులాబి జెండా రెపరెపలాడటంతో.. బరిలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. తమ అంచనాలు తారుమారయ్యాయని.. తమ ఖిల్లాలో ప్రత్యర్థి జెండా ఎలా ఎగురుతుందన్న దానిపై మేధోమధనం చేయనుంది కాంగ్రెస్. 10 రౌండ్ల కౌంటింగ్ ముగిసేవరకు టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి 18 వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో వున్నారు.
ఇక 20వ రౌండ్ కౌంటింగ్ చేపట్టిన నాటికి సుమారుగా 40 వేల ఓట్ల అధిక్యంలో వున్నారు. మొత్తంగా హుజూర్ నగర్ లో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తన భారీ అధిక్యతను నిరూపించుకోవడంతో.. ఆయన గెలుపు దాదాపు ఖాయమైపోయింది. సైదిరెడ్డి ఇళ్లు, కార్యాలయం సహా పార్టీ కార్యాలయంలోనూ కార్యకర్తలు స్వీట్లు పంచుకున్నారు. ఆయన మద్దతుదారులు సంబరాలు ప్రారంభించారు. తాను ముందుగా చెప్పినట్టుగానే బంపర్ మెజారిటీతో విజయాన్ని సొంతం చేసుకోనున్నానని ఈ సందర్భంగా సైదిరెడ్డి వ్యాఖ్యానించారు. ఇక ఓట్ల లెక్కింపు ముగిసిన తరువాత సైదిరెడ్డి ఏకంగా 43 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more