వాంటెడ్ ఫార్మర్స్... అవును రైతులు కావలెను... దేశానికి అన్నం పెట్టే రైతన్న ఆరుగాల కష్టించి పనిచేసే రైతన్నకు ఇక మంచి రోజులు రానున్నాయి. రైతన్నలు కూడా ఇకపై వేతనాలపై జీవించే రోజులు వస్తున్నాయి. వేతనం అంటే ఇప్పుడు రైతు కూలీలు ఇస్తున్నట్లుగా రోజు మూడు-నాలుగు వందలు కాకుండా.. ఏకంగా నెలవారీగా 20 వేల రూపాయల ఆకర్షణీయమైన జీతం ఇస్తామంటున్నారు. అంతేకాదు వారు వుండేందుకు బోజన, వసతి సౌకర్యాలు కూడా ఉచితంగా కల్పిస్తారట. ఇంకేమంది రైతన్నలకు మంచి రోజులు వచ్చేసినట్టే కదా.!
ఇన్నాళ్లు పంటలపై అవగాహన లేని వాళ్లు కూడా ఇకపై సేంద్రీయ ఎరువులతో వ్యవసాయం చేసిన పంటపై దృష్టి పెడుతున్నారు. దేశవ్యాప్తంగా సహజపద్దతుల ద్వారా పండిస్తున్న పంటలకు అదరన పెరుగుతుంది. వైట్ కాలర్ ఉద్యోగాలు చేసే వారి దగ్గర్నించి సాధారణ ప్రైవేటు ఉద్యోగుల వరకు తమకు సాధ్యమైనంత వరకు సహజ వ్యవసాయ పధ్దతుల ద్వారా పండించే ఫామ్ కల్టివేషన్ పైవు ఫోకస్ పెడుతున్నారు. తమ కుటుంబానికి కావాల్సిన కూరగాయలు, బియ్యం, ఇత్యాది పంటలను సహజ పద్దతుల ద్వారా పండించినవే తీసుకునేందుకు ఇష్టపడుతున్నారు. దీంతో రైతన్నలకు మరీ ముఖ్యంగా రైతు కూలీలకు ఆదరణ లభించింది. ఈ నేపథ్యంలోనే తమిళనాడుకు చెందిన ఓ సంస్థ రైతన్నలకు ఉద్యోగం ఇస్తామంటూ ప్రకటించింది.
దేశానికి వెన్నెముక రైతన్న.అటువంటి రైతన్నలు ఆరుగాలం శ్రమించినా ఫలితం దక్కడం లేదు. అప్పుల ఊబిలో చిక్కుకున్న అన్నదాత ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్నారు. వ్యవసాయాన్ని నమ్ముకుంటే బతకడం కష్టమంటూ చాలా రాష్ట్రాల్లో అన్నదాతలు వలస పోయి కూలీనాలీ పని చేసుకుంటున్నారు. దీంతో తమ పిల్లల్ని సైతం ఉద్యోగాలు చేయడానికి ప్రోత్సహిస్తున్నారు కానీ వ్యవసాయం చేయడానికి ఏ ఒక్కరు ప్రోత్సాహం అందించడం లేదు. దీంతో వ్యవసాయ రంగం కుదేలవుతోంది. భవిష్యత్తులో రైతు వ్యవస్థ దెబ్బతిననుంది.
ఇక కొందరు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని, తమ సృజనాత్మకతను జోడించి కొత్త సాగు విధానాలు కనిపెట్టి అధిక దిగుబడి కోసం ప్రయత్నం చేస్తున్నారు. అలా తమిళనాడులోని కోయంబత్తూరు కు చెందిన కీరైకడై అనే సంస్థ సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లోకి అందిస్తుంది. ఇక్కడ సంస్థ సేంద్రియ పంటలు, వ్యవసాయ ఉత్పత్తులతో ఈ సంస్థ కొనసాగుతుంది. సేంద్రియ పంటల సాగు చేస్తున్న ఈ సంస్థ రైతన్నల కొరతతో ఇబ్బంది పడుతుంది. తమ వ్యవసాయ క్షేత్రంలో తగినంత మంది రైతులు లేక ఇబ్బందులు పడుతున్న ఈ సంస్థ మంచి జీతం , భోజనం , వసతి కూడా కల్పిస్తామని రైతులు కావాలని అడుగుతుంది.
అందుకే వాంటెడ్ ఫార్మర్స్ అంటూ ఏకంగా రైతన్నలు కావలెను అని ఉద్యోగ ప్రకటన ఇచ్చింది. నెలకు 15 వేల నుంచి 20 వేల వరకు జీతం ఇస్తామని, ఉచిత భోజన వసతి కల్పిస్తామని ఆ ప్రకటనలో పేర్కొంది. సహజసిద్ధ ఆహారాన్ని సమాజానికి అందించే రైతుల కోసం ఎదురుచూస్తున్నామని, ప్రకృతి వ్యవసాయం చేయగలిగినవారికి మొదటి ప్రాధాన్యత అని పేర్కొంది. ఈ ప్రకటన చూస్తేనే అర్థమవుతుంది మన దేశానికి రైతన్నలు కావలెను అని.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more