సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. సోనియా గాంధీ రాజకీయ వారసుడిగా పగ్గాలు చేపట్టిన అనతికాలంలోనే తన సత్తా చాటిన రాహుల్ గాంధీ.. ఇలీవల జరిగిన మూడు రాష్ట్రాల ఎన్నికలలో కొమ్ములు తిరిగిన ప్రత్యర్థులను కూడా ఖంగుతినిపించి రాజకీయంగా పైచేయి సాధించారు. ఈ తరుణంలో రాఫెల్ డీల్ తో మోడీ ప్రభుత్వాన్ని ఇంటాబయట తూర్పారబడుతున్న రాహుల్ గాంధీ.. లోక్ సభ ఎన్నికలకు ముందు మరో కీలక అడుగు వేశారు.
తన సోదరి ప్రియాంక గాంధీకి కాంగ్రెస్ పార్టీలో కీలక పదవిని అందించారు. అమెను ఏఐసిసి జనరల్ సెక్రెటరీగా నియమించిన రాహుల్.. సార్వత్రిక ఎన్నికలలో అత్యంత కీలకమైన ఉత్తర్ ప్రదేశ్ తూర్పు ప్రాంతం బాధ్యతలను కూడా అప్పగించారు. ఈ మేరకు ఏఐసిసి జనరల్ సెక్రటరీ అశోక్ గెహ్లాట్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తరప్రదేశ్లో ప్రధాని నరేంద్రమోడీ సహా సీఎం యోగి ఆదిత్యనాథ్ లకు చెక్ పెడుతూ.. కాంగ్రెస్ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించింది. ఇదే క్రమంలో ఎస్పీ-బీఎస్పీలతో కలసి ఎన్నికల్లోకి వెళ్తామని కూడా సంకేతాలను ఇచ్చింది.
తూర్పు ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు సంబంధించిన వ్యూహాలు, ప్రిపరేషన్స్ను ఇకపై ప్రియాంక గాంధీ పర్యవేక్షించనున్నారు. గత ఎన్నికల్లోఅభ్యర్థుల ఎంపిక దగ్గరనుంచి, ఎన్నికల వ్యూహాల వరకు ప్రియాంక అన్నీ దగ్గరుండి చూసుకున్నారు. అయితే అనధికారిక హోదాలోనే ఆ బాధ్యతలు నిర్వర్తించిన ప్రియాంక.. ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగి ఆ బాధ్యతలు చేపట్టనున్నారు.పార్టీకి దోహదపడే ప్రతీ ఒక్కరిని ఉపయోగించుకోవాలన్న ఆలోచనలో భాగంగానే ప్రియాంకకు రాహుల్ కీలక బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది.
INC COMMUNIQUE
— INC Sandesh (@INCSandesh) January 23, 2019
Appointment of General Secretaries for All India Congress Committee. pic.twitter.com/zHENwt6Ckh
ప్రియాంక గాంధీతో పాటు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియాకు కూడా కీలక బాధ్యతలు అప్పగించారు. ఇటీవలి మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ను సమర్థవంతంగా నడిపించిన సింధియాకు ఉత్తరప్రదేశ్ వెస్ట్ బాధ్యతలు అప్పగించారు. ఉత్తరప్రదేశ్ వెస్ట్ కాంగ్రెస్కు ఆయన జనరల్ సెక్రటరీగా వ్యవహరించనున్నారు. ఇక మరో ఏఐసిసి ప్రధాన కార్యదర్శిగా వున్న గులాంనబి అజాద్ కు ఇక హర్యానా రాష్ట్రానికి ఇంచార్జ్ గా నియమించింది.
ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన ట్విట్టర్ ద్వారా తన సోదరికి శుభాకాంక్షలు తెలిపారు. పేదల అభ్యున్నతి కోసం ప్రియాంక పనిచేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తన సోదరితో రాజకీయాంగా కలసి పనిచేయడం సంతోషంగా వుందని చెప్పారు. ఉత్తర్ ప్రదేశ్ లో ఎస్పీ, బీఎస్పీలతో కలసి పనిచేస్తామన్నారు. ఉత్తర్ ఫ్రదేశ్ కు ఏం కావాలో కాంగ్రెస్ కు బాగా తెలుసునని రాహుల్ పేర్కోన్నారు. తన సోదరి ప్రియాంక సమర్ధురాలని కూడా చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more