గత ఏడాది డిసెంబర్ 11న వెల్లడైన ఓటరు తీర్పుతో మహాకూటమి పార్టీలు ఒక్కసారిగా ఖంగుతిన్నాయి. అధికారంలోని పార్టీ ఈవీఎంలను హ్యాకింగ్ చేసిందన్న అరోపణలు కూడా వెలుగులోకి వచ్చాయి. అయితే కాంగ్రెస్ మాత్రం ఓటరు తీర్పును గౌరవిస్తామని హుందాగా స్పందించినా.. పార్టీలోని క్రీయాశీలక నేతలైన రేవంత్ రెడ్డి, డీకే అరుణ, గీతారెడ్డి, చిన్నారెడ్డి, దామోదర రాజనర్సింహా తదితరులు పరాజయం పాలుకావడం విస్మయానికి గురిచేసింది.
అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు పథాకాలతోనే మార్పు వచ్చి.. ఆ దిశగా గాలి వీచిందని ప్రజలు భావిస్తున్నారు. కాగా, బీఎస్సీ పార్టీ తరపున ఎన్నికల బరిలో నిలిచిన మల్ రెడ్డి రంగారెడ్డి ఎన్నికల లెక్కింపులో అవకతవకలు జరిగాయని రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టును అశ్రయించిన విషయం తెలిసిందే. ఆయన పిటీషన్ ను స్వీకరించిన న్యాయస్థానం ఈ నెల 30న సమగ్ర సమాచారంతో న్యాయస్థానంలో హాజరుకావాలని హైకోర్టు రాష్ట్ర ఎన్నికల అధికారులకు అదేశించింది.
ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన మల్ రెడ్డి రంగారెడ్డి తరపు న్యాయవాది, సీనియర్ కాంగ్రెస్ నేత కపిల్ సిబాల్.. వీవీ ప్యాట్ ప్రింటింగ్ స్లిప్ లు థరల్ పేపర్ పై ప్రింట్ అవుతున్నాయని.. అయితే వీటిపై చేసిన ప్రింటింగ్.. రెండు వారాల నుంచి నెల రోజుల వ్యవధిలో క్రమంగా చెరిగిపోతుందని ఆయన అన్నారు. దీంతో ఎన్నికలలో అవకతవకలు జరిగాయన్న అరోపణల నేపథ్యంలో ప్రత్యర్థులు న్యాయపోరాటం చేసిన తరువాత న్యాయస్థానాల అదేశాల మేరకు ఓట్లను వీవీ ప్యాట్లతో లెక్కించమని చెబితే అప్పటికీ అన్ని వీవీప్యాట్ స్లిప్పులు చెరిగిపోతుందని అయన అన్నారు.
ఇక మల్ రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంగా అతిపెద్ద దేశమైన భారత్ లో ప్రజాస్వామ్యాం మరింత పరఢవిల్లాలంటే.. ఎన్నికల కౌంటింగ్ ను వీవీ ప్యాట్ స్లిపులతోనే నిర్వహించాలని డిమాండ్ చేశారు. తన విషయంలో రెండు ఈవీఎం యంత్రాలకు.. వీవీ ప్యాట్ స్లిపులకు మధ్య 30 ఓట్ల వత్యాసం వచ్చిందని అలాంటిది మూడు నుంచి నాలుగు వందల ఈవీఎంలతో ఎంత వ్యత్యాసం వస్తుందో అర్థం చేసుకోవచ్చునని అన్నారు. ప్రజాధనంతో ఎన్నికలు నిర్వహిస్తున్న క్రమంలో ప్రజల ఓటుకు కూడా మరింత జవాబుదారి తనం కల్పించేందుకు వీవీప్యాట్ స్లిపులతోనే కౌంటింగ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more