కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోమారు ప్రధాని నరేంద్రమోడిని టార్గెట్ గా చేసుకుని తీవ్రంగా విమర్శలు గుప్పించారు. అధికారంలోకి వచ్చిన తరువాత నాలుగేళ్లుగా నీతివంతమైన పాలన, నిజాయితీ, పారదర్శక పాలన అంటూ ఊదరగోట్టిన ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం.. రాఫెల్ యుద్ద విమానాల కోనుగోలులో భారీ ఎత్తున అవినీతి జరిగిందని తాను పదే పదే ఆరోపిస్తున్నా.. ఈ విషయంలో సిబీఐ దర్యాప్తుకు ఎందుకు వెనకాడుతున్నారని రాహుల్ ప్రశ్నించారు. ప్రజలకు చెప్పేందుకే సూక్తులు, నీతులు.. కానీ తాము మాత్రం వాటికి దూరం అన్నట్లుగా ప్రధాని మోడీ వ్యవహరిస్తున్న తీరువుందని విమర్శించారు.
రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందానికి సర్వీస్ ప్రొవైడర్ గా రిలయన్స్ డిఫెన్స్ ను ఎంపిక చేయడంలో తమ పాత్ర ఏమీ లేదని... రిలయన్స్ డిఫెన్స్ పేరును భారత ప్రభుత్వమే సూచించిందంటూ ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఉన్న ఫ్రాంకోయిస్ హోలాండ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఢిల్లీని కుదిపేస్తున్నాయి. విపక్షాలన్నీ మోదీ సర్కార్ పై విరుచుకుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీపై.. రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దేశ చరిత్రలోనే రాఫెల్ అతి పెద్ద కుంభకోణమంటూ ఇప్పటికే విమర్శిస్తున్న రాహుల్... దేశాన్ని మోదీ మోసం చేశారంటూ మండిపడ్డారు.
మోదీ దేశ ద్రోహానికి పాల్పడ్డారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనకు తానే స్వయంగా వేల కోట్ల విలువైన డీల్ ను అనిల్ అంబానీకి మోదీ అప్పగించారని రాహుల్ విమర్శించారు. రాఫెల్ ఒప్పందం వెనుక ఉన్న నిజాలను బయటపెట్టినందుకు ఫ్రాంకోయిస్ కు ధన్యవాదాలు తెలిపారు. ఫ్రాంకోయిస్ వ్యాఖ్యలతో అనిల్ అంబానీకి మోదీనే స్వయంగా డీల్ ను అప్పగించారనే విషయం స్పష్టమయిందని చెప్పారు. దేశ ద్రోహానికి పాల్పడ్డ మోదీ... దేశం కోసం ప్రాణాలను పణంగా పెడుతున్న సైనికుల రక్తాన్ని అగౌరవపరిచారని విమర్శించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more