ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి రావడమే పరమావధిగా సుమారు 267 రోజులగా ఏకబిగిన పాదయాత్ర చేస్తున్న విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కు విజయనగరంలో.., అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే అహ్వానాలు పలుకుతున్నారు. అదేంటి స్వాగత కార్యక్రమాలు పర్యవేక్షించాల్సింది ఆ జిల్లా పార్టీ ఇంచార్జులు.. సదరు నియోజకవర్గ సమన్వయకర్త కదా.? మరీ టీడీపీ ఎమ్మెల్యే ఎందుకు స్వాగతం పలుకుతున్నారు.. పార్టీ మారుతున్నారా.? అన్న సందేహాలు అవసరం లేదు.
ఎందుకంటే జగన్ కు స్వాగత ఫ్లెక్సీలు కడుతున్న అధికార టీడీపీ ఎమ్మెల్యే ఆయనను పరోక్షంగా టార్గెట్ చేసే క్రమంలోనే ఈ స్వాగత తోరణాలు కట్టిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే. ప్రస్తుతం విశాఖపట్టణంలో పాదయాత్ర చేస్తున్న జగన్.. ఇక ఆ జిల్లా నుంచి విజయనగరంలో జిల్లాలోకి అడుగుపెట్టనున్నారు. ఈ క్రమంలో శృంగవరపు కోట అధికార టీడీపీ ఎమ్మెల్యే కోళ్ల లలిత.. జిల్లాలో అడుగుపెట్టీ పెట్టకముందే ఝలక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. జగన్ రాకతో వైసీపీ పార్టీ నేతలు పెట్టించే ఫ్లెక్సీలతో ఆయా ప్రాంతం మొత్తం ఆకుపచ్చ వర్ణంగా మారుతున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో అక్కడి జనసమీకరణను చూసి జగన్.. ప్రభుత్వంపై విమర్శలను గుప్పిస్తూ.. ప్రజలకు నీతిసూక్తులను వల్లెవేస్తున్నారని విమర్శించిన కోళ్ల లలిత.. గతంలో తనపై వచ్చిన విమర్శలను, అరోపణలను ప్రముఖంగా ప్లెక్లీలలో ప్రచురించి వాటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. జగన్ తో పాటు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణల అవినీతి అక్రమాలపై గతంలో పత్రికల్లో వచ్చిన వార్తల క్లిప్పింగులను శృంగవరపుకోటలో ఫ్లెక్సీలుగా ముద్రించి ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారు.
అంతేకాదు, వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్ లపై బొత్స గతంలో చేసిన ఆరోపణలను కూడా ఫ్లెక్సీల్లో ముద్రించారు. అప్పుడు ఉప్పు నిప్పులా వున్న నేతలు.. ఇప్పుడెలా అల్లం బెల్లంగా మారారని అమె ప్రశ్నిస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ అశోక్ గజపతిరాజు శృంగవరపు కోటకు చేరుకుని ఈ ఫ్లెక్సీలను పరిశీలించారు. పాదయాత్రలో నీతి వాక్యాలు వల్లిస్తున్న జగన్ బండారం వీటితో బయటపడుతుందని అశోక్ గజపతి రాజు వ్యాఖ్యానించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more